Ys sharmila padayatra

ys sharmila padayatra, state bank of india, atm centre, contractor, srinivas, murder in rajahmundry, arts college area, east godavari district, 7crores of rupees missing, unidentified persons, police case"

ys sharmila padayatra

ఏటీఎం చోరీ డబ్బులు షర్మిల పాదయాత్రలో 3 కోట్లు ఖర్చు..

Posted: 07/09/2013 07:59 PM IST
Ys sharmila padayatra

200రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ షర్మిలపై కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రాజమండ్రిలో జరిగిన 7కోట్లు ఏటీఎం చోరీ డబ్బులు షర్మిల పాదయాత్రలో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఎటిఎమ్ నిర్వాహకుడు శ్రీనివాస్ హత్య కేసులో నిందితులలో ఒకరికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు సంబంధం ఉందని ఆరోపణలు వస్తుండడం కొత్త మలుపు తిరుగుతోంది. ఏడు కోట్ల రూపాయల చోరికి సంబందించి మొత్తం పదిమందిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఇతను ఒక సినిమా తీయడంతో పాటు షర్మిల పాదయాత్ర సందర్భంగా మూడు కోట్లు ఖర్చుచేశాడని పోలీసులు చెబుతున్నట్లు గా వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. శ్రీదర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అనుచరుడు కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. నిందితుల నుంచి రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా శ్రీధర్ రెడ్డికి తమ పార్టీకి సంబంధం లేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వార్తల్లో నిజం ఏమిటో అనేది పోలీసులే నిర్ణయించాలి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles