Jagan ysr telangana protesters attack on ys vijayamma

ys vijayamma, telangana protesters, trs party, trs mla, ysrcp, konda surekha,

telangana protesters attack on ys vijayamma

వైఎస్ విజయమ్మను, తాకిన తెలంగాణ సెగ?

Posted: 05/21/2013 03:05 PM IST
Jagan ysr telangana protesters attack on ys vijayamma

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు కాగజ్‌నగర్‌లో తెలంగాణ సెగ తగిలింది. జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన ఆమెను అదిలాబాదులోని సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద తెలంగాణవాదులు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వేంపల్లి వద్ద కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకొని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేశారు. అంతకుముందు విజయమ్మ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాజెక్టు సైడ్‌ను సందర్శించేందుకు ఆమె ఎపి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఉదయం పదకొండున్నరకు ఆమె కాగజ్ నగర్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె రోడ్డు మార్గం గుండా వెళ్తుండగా సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. విజయమ్మ వెంట మాజీ మంత్రి, వరంగల్ జిల్లా నేత కొండా సురేఖ ఉన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా వస్తే అడ్డుకుంటామని తెలంగాణవాదులు ఇప్పటికే హెచ్చరించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles