డబ్బు అవసరానికి ఉపయోగపడుతుంది. అదే డబ్బు ఆపదలు కూడా తెచ్చిపెడుతుంది. ఆ డబ్బే ఒక్కసారి నలుగురిలో చావుదెబ్బలు తినమని చెబుతుంది. డబ్బు కోసం మూర్ఖంగా ముందు చూపులేని ఒక పెళ్లి కొడుకుకు వీపు విమానం మోత మోగించింది ఆ పెళ్లి కూతురు. పచ్చని పెళ్లి పందిరిలో పెళ్లికోడుకుకు పెళ్లి కూతురు చేతిలో చావు దెబ్బ తిన్నాడు.
కట్నం ఇచ్చిన తరువాతే తాళికి మూడో ముడి వేస్తానని భీష్మిస్తే.... అందరి ఆడపిల్లలా చీరకొంగును నోట్లో కుక్కుకుని కుమిలిపోలేదు. ఇంట్లోకి పరుగులు తీసి తలుపులు వేసుకోలేదు. మంచానికి అడ్డంగా పడి ఎక్కిఎక్కి ఏడవలేదు. పెద్దల సాక్షిగా పెళ్లి పెటాకు లవుతుంటే తట్టుకోలేకపోయింది. అంతే వరుడి చొక్కాపట్టుకుంది. లెంపలు వాయించింది. దాడికి దిగింది. తమ ఆడబిడ్డ తెగింపునకు బంధువులూ జతకలిశారు.
అంతే పెళ్లి తంతు రణరంగంగా మారింది. వరుడు, అతని తల్లిదండ్రులతో సహా పెళ్లికొచ్చిన పెళ్లికొడుకు తరపువారందరినీ చితక్కొట్టారు. చివరికి ఈ పంచాయతీ పోలీసు స్టేషన్కు చేరింది. వరంగల్ జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన గార శంకరయ్య, విమల దంపతుల కుమార్తె సృజనను మణుగూరు మండలం పగిడేరు పంచాయతీ కొడిశలకుంట గ్రామానికి చెందిన ఇట్టిమల్ల పిచ్చయ్య, వెంకటమ్మ దంపతుల కుమారుడు ప్రశాంత్తో వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
కొడిశలకుంట గ్రామంలోని ఓ ప్రార్థనామందిరంలో పెళ్లి వేడుక ఆరంభమైంది. మాంగళ్య ధారణ జరుగుతున్న సమయంలో తమకు ఇస్తామన్న రూ.20వేలు నగదును వరుడి బంధువులు అడిగారు. త్వరలోనే ఇస్తామని పెళ్లిని ఆపొద్దని వధువు తల్లిదండ్రులు బతిమిలాడారు. కాళ్లు పట్టుకున్నారు. వరుడు మాత్రం తాళికట్టటానికి ససేమిరా అన్నాడు.
దీనికి తోడు వరుడి తరపున వధువుకు పట్టీలు, దిద్దులు సమర్పించలేదు. దీంతో అటు పెళ్లికొడుకు, ఇటు వధువు బంధువుల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహావేశాలతో ఇరువర్గాల దాడికి దిగాయి. మూడు ముళ్ల బంధం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వధువు కోపంతో వరుడు ప్రశాంత్పై దాడికి దిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more