ప్రధాని మన్మోహన్సింగ్ ఎంత త్వరగా రాజీనామా చేస్తే దేశానికి అంత మంచిది అని పిఎసి చైర్మన్, బిజెపి సీనియర్ నేత ప్రొఫెసర్ మురళీ మనోహర్ జోషి వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనేదే బిజెపి విధానమని, పొరుగు దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినపుడు వాటితో సత్సంబంధాలే తమ ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్తాన్లో మళ్లీ స్థిరత్వం పాందుగొలిపేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కృషి చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు కొనసాగించిన విధానమే తమదని పేర్కొన్నారు. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని తాము కోరుతున్నామని ఇందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీని కేవలం సిబిఐకే పరిమితం చేయకుండా రాజ్యాంగబద్ధమైన సంస్థలకు కూడా వర్తింపచేయాలని అన్నారు. ప్రధానమంత్రితో పాటు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి నాయకత్వం వహించే కమిటీ ద్వారా రాజ్యాంగబద్ధమైన సంస్థలకు నియామకాలు జరగాలని అన్నారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయాలని కేంద్రప్రభుత్వం చూస్తోందని, అది దేశానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని మురళీమనోహర్ జోషి అన్నారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో ఏ విధానం అనుసరిస్తోందో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
స్వేచ్ఛా వాణిజ్యం వల్ల సామాన్యులకే కాదని దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ విషయమై తాము వాణిజ్యశాఖ మంత్రితోనూ అధికారులతోనూ మాట్లాడి, ప్రధానికి ఒక లేఖ రాశామని, ప్రస్తుతానికి ఆగినా, భవిష్యత్లో ఈ ఒప్పందం జరిగితే మన వాణిజ్య రంగంపై కూడా మనకు అదుపు తప్పుతుందని అన్నారు. యూరోపియన్ దేశాలు మన వాణిజ్యరంగంపై పెద్దరికం చేసే ముప్పు ఉందని వివరించారు. దేశీయ చట్టాలకు కూడా నష్టం జరుగుతుందని అన్నారు. ఇలాంటి ఒప్పందాలను తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తుందని అన్నారు. ఇలాంటి ఒప్పందాలపై ప్రజాభిప్రాయం స్వీకరించకుండా సంతకాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో బిజెపి తన అవకాశాలను మెరుగుపరుచుకుంటుందని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more