రేపు జరిగే కాంగ్రెసు కీలక సమావేశంలో అశ్వినీ కుమార్, బన్సాల్ల భవిష్యత్తు తేలిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. బన్సాల్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. కోల్ గేట్ కేసులో సిబిఐ నివేదికను మార్చారనే ఆరోపణలను అశ్వినీ కుమార్ ఎదుర్కుంటున్నారు. కాగా అశ్వినీ కుమార్కు శాఖ మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2014 ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న పవన్కుమార్ బన్సల్, అశ్వనీకుమార్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. వీరి రాజీనామాలను ప్రధానమంత్రి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
ఈనెల 13న మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు సమచారం. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తే బాగుంటుందని, రాష్ట్రంలో అసంతృప్తి నేతలకు ఈసారి అవకాశం కల్పించాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచిస్తున్నట్లు తెలియవచ్చింది. కావూరి సాంబశివరావుకు ఈసారి అవకాశం రావచ్చునని, ఆయనకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి పదవి ఇవ్వవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర కేబినెట్లో శాఖల మార్పునకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జైపాల్రెడ్డికి రైల్వేశాఖ, న్యాయశాఖ మంత్రిగా కపిల్ సిబల్, హోం మంత్రిగా గులాం నబీ ఆజాద్ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పవన్కుమార్ బన్సల్ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బన్సాల్ రాజీనామా చేయక తప్పదని అంటున్నారు. లేదంటే ఆయనకు ఉద్వాసన పలికవచ్చునని చెబుతున్నారు. బన్సాల్ను సిబిఐ ఏ క్షణంలోనైనా విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ సమావేశానికి బన్సాల్ హాజరు కాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more