వేసవి రద్దీ ఇంకా మొదలవలేదు అప్పుడే దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. సికింద్రాబాద్-తిరుపతి పద్మావతీ ఎక్స్ ప్రెస్ లో తెల్లవారు ఝామున ప్రయాణీకులు నిద్రలో ఉండగా రైలు పేళ్ళూరు సమీపిస్తున్న సమయంలో రైలు గొలుసు లాగి, రైలు ఆగగానే నాలుగు కంపార్ట్ మెంట్లలో నలుగురు దోపిడీ దొంగల ముఠా విడివిడిగా బంగారు గొలుసులను ప్రయాణీకుల మెడల్లోంచి లాక్కుని ఉడాయించి చీకట్లో కలిసిపోయారు.
దొంగలు ఎస్-2, ఎస్-5, ఎస్-9, ఎస్-12 లలోంచి దొరికిన గొలుసులు లాక్కుని జరిగిందేమిటో తెలిసే లోపులోనే అక్కడి నుండి అదృశ్యమైనారు.
ఈ సంఘటనతో అప్రమత్తమైన రైల్వే పోలీసు బలగాలు, దుండగులను పట్టుకోవటానికి పథకం వేస్తున్నారు. దానిలో భాగంగా ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీస్ పెట్రోలింగ్ ని ముమ్మరం చేస్తూ పాత నేరస్తుల కదలికలను కనిపెట్టే పనిలో పడ్డారు. వేసవి మూలంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రత్యేక రైళ్ళతో పెంచుతున్న రైలు సేవల దృష్ట్యా పోలీసు బలగాలు కూడా పెరిగి పథకం ప్రకారం దుండగుల ఆటకట్టించటానికి సిద్ధపడుతున్నారు.
దొంగలు తెలివైనవాళ్ళే కాకుండా చోరవృత్తిలో ఆరితేరినవాళ్ళలాగానే ఉన్నారు. నియమిత స్థలంలో ఎవరో ఒకరు చైన్ లాగారు. అంతకు ముందు నుంచే నిఘా పెట్టివుంచిన ఆడవాళ్ళ మెడలోని బంగారు గొలుసుని ఒక్కసారిగా లాగి ఎవరికి వారు వెంటనే రైలు దిగి వెళ్ళిపోయారు. మంచి నిద్రలో ఉండటం వలన నష్టపోయినవాళ్ళకి కూడా పూర్తిగా విషయం అర్థం కాకముందే దొరికినదానితో తృప్తిపడి వెళ్ళిపోయారు కానీ అత్యాశకు పోలేదు.
మరో విషయమేమిటంటే అందరూ ఒకే భోగీలో కాదు సరికదా పక్కపక్క భోగీల్లో కూడా ఎక్కలేదు. ఎస్ 2, 5, 9, 12 నంబర్ భోగీల్లో ఎక్కారు. ఒకవేళ ఒకళ్ళు పట్టుబడ్డా మిగతా వాళ్ళు పారిపోయి, ఆ తర్వాత అందరూ దొంగసొమ్ముని పంచుకోవచ్చన్నది వాళ్ళ ప్రణాళికయ్యుండాలి. ఒక భోగీలోంచి అరుపులు వచ్చినా మిగతా వాళ్ళు క్షేమంగా తప్పించుకోవచ్చు. వాళ్ళు దిగిన ప్రాంతం కూడా వాళ్ళకి బాగా తెలిసిన ప్రాంతమైవుండాలి. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే దొంగలను పట్టుకోవటం కష్టమేమీ కాదు. కాకపోతే నష్టపోయినవారికి తిరిగి ఎంత చేతికి వస్తుందా అన్నదే ప్రశ్న.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more