పెరిగిపోయిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు నుంచి ఢిల్లీలో నిరాహార దీక్షకు పూనుకోవటమే కాక, పౌరులందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనమని పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ తూర్పు ఢిల్లీ సుందర్ నగర్ లో సామాన్యమైన ఇంటిలో సత్యాగ్రహం చేయటానికి సిద్ధమయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రిజస్టరై 21 నుండి రాజకీయ పార్టీగా గుర్తింపుని పొందింది. దేశ స్వాతంత్రం యోధులు కన్న కలలు సాకారమవటానికి ఇది మొదటి అడుగంటూ కేజ్రీవాల్ ప్రకటించారు.
విద్యుత్, తాగు నీటి బిల్లులు బాగా పెరిగిపోయాయి. వాటిని సామాన్యుడు కట్టగలిగే స్థితిలో లేడు కాబట్టి ప్రతఘటించండి. ఎవరూ బిల్లులను చెల్లించకండి అంటూ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కనెక్షన్లను కట్ చేస్తారేమోనని భయపడుతున్నారేమో. కానీ అందరూ సంఘటితమౌతేనే ఉద్యమం నడుస్తుంది. మహా అయితే మీ మీద పోలీసు కేసులు పెడతారేమో. ఏం పరవాలేదు మన ఆఆపా అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఆ కేసులన్నిటినీ మేము ఎత్తేస్తాం అన్నారు కేజ్రీవాల్.
కేవలం అవినీతి పెరిగిపోవటం వలనే ఆ భారం సామాన్య ప్రజలమీద ఈ విధంగా ఛార్జీల రూపంలో పడుతోందని, అందువలన ప్రభుత్వం ఛార్జీలను సగానికి సగం తగ్గించమని నా డిమాండ్ అన్న కేజ్రివాల్ ఢిల్లీ ప్రజలు సంఘటితులై కరెంటు బిల్లులు కట్టటం పూర్తిగా మానేసేంత వరకూ తన దీక్ష నిరవధికంగా కొనసాగుతుందని అన్నారు.
కేజ్రీవాల్ చేసే ఈ ఉద్యమానికి స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ తమ్ముడు కుల్బీర్ సింగ్ మనుమడు అభిజీత్ సింగ్ తన సహకారాన్ని ప్రకటించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more