ఇటలీ ప్రభుత్వం నిందితులైన వారి నావికా అధికారులను భారత్ కి అప్పజెప్పటానికి నిరాకరించిన నేపథ్యంలో భారత్ తీసుకోవలసిన చర్య ఏమిటన్నదానిలో చర్చించటానికి భారత విదేశాంగ శాఖామాత్యులు సల్మాన్ ఖర్షీద్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో ఆయన నివాసంలో ఈరోజు భేటీ అయ్యారు.
కేరళ సముద్ర జలాలలో మత్స్యకారులను కాల్చి చంపిన నేరంలో అదుపులోకి తీసుకున్న ఇటలీ నావికా అధికారులను ఇటలీ భారత్ కి పంపించటానికి అంగీకరించకపోవటాన్ని తప్పు పట్టిన ప్రధాన మంత్రి నిన్న ఇటలీ ప్రభుత్వాన్ని అందుకు పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
విచారణలు తాము మత్సకారులను చంపినట్టుగా అంగీకరించిన నావికా అధికారులను ఒక సారి క్రిస్ట్ మస్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవటం కోసం, మరోసారి ఎన్నికలలో ఓటు హక్కుని వినియోగించుకోవటం కోసం ఫిబ్రవరి ఇటలీకి వెళ్ళనిచ్చిన భారత ప్రభుత్వం, మొదటి సారి లాగానే తిరిగి నాలుగు వారాల గడువులో పంపిస్తారనుకుంటే, ఇటలీ అందుకు నిరాకరించింది. భారత్ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇందులో వర్తించవని, అంతర్జాతీయ న్యాయస్థానమే అందుక అర్హమైనదని సాంకేతిక వంకలను చూపుతూ ఇటలీ, నావికా అధికారులను పంపించమన్న భారత్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఈ విషయం మీద కేంద్రంలో ఉభయసభలలోనూ ఆందోళనలు చెలరేగాయి. దానితో ప్రధాన మంత్రి ఇటలీని తీవ్ర స్థాయిలో మందలించారు. మీ నిర్ణయం మాకు సమ్మతం కాదు, నేరస్తులనిద్దరినీ భారత్ కి విచారణకు పంపించండి అని గట్టిగా చెప్పారు.
చెప్పటాలు, హెచ్చరించటాలు, సంబంధాలు తెగిపోతాయని బెదిరించటాలూ అయిపోయాయి. ఇటలీ తను చెయ్యదలచుకున్నది చేసి, చెప్పదలచుకున్నది చెప్పి మాట్లాడకుండా ఊరుకుంది. ఇప్పుడ మనం ఏం చెయ్యాలి అన్నదానిలో సరైన నిర్ణయానికి రావటం కోసం సల్మాన్ ఖుర్షీద్ ప్రధాన మంత్రితో చర్చించటానికి ఈరోజు వెళ్ళారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more