శ్రీకాకుళం పట్టణంలోని జిటి రోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక ఏడురోడ్ల కూడలి నుండి రామలక్ష్మణ కూడలి వరకు 63 అడుగుల మేర విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి అనంతరం దానిని 60 అడుగుల మేర విస్తరించేందుకు ప్రణాళికలు తయారుచేశారు. దీనికి 12 కోట్ల రూపాయల నిధులు కేటాయించి రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. ఇదిలా ఉండగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటి నుండి ఒక హోటల్ ఎదురుగా ఉన్న రామాలయం విషయంలో పలు విమర్శలు ఎదురవుతునే ఉన్నాయి. హోటల్ ఎదురుగా ఉన్నందున ఆలయాన్ని తొలగించేందుకు హోటల్ యజమానులు ప్రయత్నాలు మొదలుపెట్టారని, అందుకే రోడ్డు విస్తరణలో జంతర్మంతర్గా కొలతలు తీశారని పలువురు పేర్కొంటూనే ఉన్నారు. అందుకే రామాలయం ఎదురుగా ఉన్న మంచినీటి బోరింగ్ను హోటల్కు, రామాలయానికి మధ్యన సిసి రోడ్డు వేయడానికి తొలగించేశారు. అప్పటినుండే రామాలయం కూడా తొలగించేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పుకుంటున్నారు.
అందుకే రోడ్డు విస్తరణలో ఎదురుగా ఉన్న స్థలాన్ని వదిలి రామాలయం మీదుగా ఆరు అడుగుల మేర తొలగింపుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు మార్కింగ్ను చేశారని చెబుతున్నారు. అయితే, ఆలయం బరాటం గణపతి అనే ఆయన స్థలంలో ఉందని, ఆయన ఆలయానికి స్థలం అప్పగించారని తెలిసింది. రోడ్డు విస్తరణలో రామాలయాన్ని కూల్చరాదంటూ అతని పేరుతోనే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనికి హైకోర్టుకూడా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పేరుతో రామాలయ తొలగింపుపై మరిన్ని వివరాలు కోరుతూ ఫిబ్రవరి 28న షోకాజ్ నోటీసు జారీచేసింది. దీనిని ఆధారంగా చేసుకొని ధార్మిక పరిషత్ సంస్థలు పలువిధాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కాగా, అది కోర్టు స్టే కాదని, షోకాజ్ నోటీస్ మాత్రమే అని పేర్కొంటూ అధికారులు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దేవాలయాన్ని జెసిబితో పడగొట్టేశారు. దీనిపై వెంటనే స్పందించిన ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆలయం కూల్చివేతపై ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ధర్నా చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ హోటల్కు వత్తాసు పలుకుతూ వారికి లబ్ధి చేకూర్చేందుకే ఆలయాన్ని పడగొట్టారని, లేదంటే తెల్లవారుజామున హుటాహుటిన పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more