రాజకీయం సునామీలో ఎలాంటి వారైన కొట్టుకుపోవాల్సింది. చదువు ఉన్న సరే , చదువు లేకపోయిన సరే.. రాజకీయం రంగు పడితే చాలు.. ఓటు అమ్ముకోవాల్సిందే. ఇప్పుడు అదే పరిస్థితి నడుస్తుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు పట్టభద్రులు మాత్రం అర్హులు. చదువులేని వారికి ఓటు హక్కులేదు. రాజకీయ నాయకులు పట్టభద్రులను సైతం సెల్ ఫోన్ లతో మభ్యపెడుతున్నారు. ఓటేస్తే .. కొత్త సెల్ ఫోన్ ఉచితం. ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ప్రలోభాలు మొదలయ్యాయి. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సుమారు 2 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఓటుకు సెల్ ఫోను పంపిణీ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఓటర్ల జాబితాను వెంటబెట్టుకుని ఓటు చిటీతో పాటు సెల్ ఫోన్లు అందజేస్తున్నారు. పంపిణీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఓటరు ఈ సెల్ ఫోన్లు తీసుకోవడానికి నిరాకరించలేదని ఈ అభ్యర్థికి చెందిన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. చదువుకున్నవాడికి సెల్ ఫోన్ – చదువు లేని వాడికి సీసా మందు ఇస్తే ఓట్లు రాలిపోతాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more