వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు రాహుల్ గాంధీ తన అనుచరులను రంగంలోకి దింపారు. దేశ వ్యాప్తంగా పర్యటిస్తోన్న వారు కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సిట్టింగ్ ఎంపీల పనితీరు వారి విజయవకాశాలను అడిగి తెలుసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీకి వ్యతిరేకత ఉంటే కొత్త అభ్యర్ధి పేరును సూచించాలని కోరుతున్నారు. సీమాంధ్రలో పార్టీ పనితీరును అంచనా వేసేందుకు గోవాకు చెందిన విశ్వజిత్ రాణే,జితేందర్ దేశ్ ముఖ్ రాష్ర్టానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నాయకులందరూ హైద్రాబాద్ లో ఉండటంతో వారిని కలిసే ప్రయత్నం చేశారు.
ఆయన నిన్న అసెంబ్లీలోని సిఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ముందుగా పిసిసి అధ్యక్షుడు బొత్సను కలిసిన వారు... ఆ తరువాత రాయలసీమకు చెందిన నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకుంటూనే... వైఎస్సార్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందని అడిగారు. ఒకవేళ జగన్ తో రాజీ కుదుర్చుకుంటే ఎలా ఉంటుదని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది. అందుకు జెసి హైకమాండ్ రాజీకి సిద్ధంగా ఉన్నా... జగన్ సుముఖంగా లేరని చెప్పినట్టు సమాచారం. ఇదే ప్రశ్నను రాయలసీమకు చెందిన మంత్రులు టిజి వెంకటేశ్,ఏరాసు ప్రతాప్ రెడ్డి, అహ్ముదుల్లాను కూడా అడిగినట్టు తెలిసింది. మరో నాలుగు రోజులు రాహుల్ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ పరిస్థితులపై హైకమాండ్ కు నివేదిక ఇస్తారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more