చిన్నారి సాన్వి క్షేమంగా తమ ఒడికి చేరుతుందని ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి చివరకు తీవ్ర విషాదమే మిగిలింది. స్వాన్నిని ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడన్న చేదువార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కు పచ్చలారని పదినెలల పసిపాప సాన్వి నూరేళ్ల జీవితాన్నిమానవ రూపంలో ఉన్న రాక్షసుడు చిదిమేశాడు. సంతోషంతో కళకళ్లాడుతున్న ఇంటిని శ్మశానంగా మార్చాడు. బంధువే హంతకుడవుతాడని సాన్వి కుటుంబం పసిగట్టలేకపోయింది. బంధువు రూపంలోనే నరరూప రాక్షసుడు ఉన్నాడనే సంకేతాలను శివ, లత దంపతులు తెలుసుకుని ఉంటే జన్మనిచ్చిన సాన్వికి నూరేళ్ల జీవితాన్ని ప్రసాదించేవారయ్యేవారు. ఐనా భగవంతుడికి ఇసుమంతైనా దయ, దాక్షిణ్యం, కరుణ లేకపోయాయి. పదినెలల చిన్నారి సాన్వి సజీవంగా తిరిగి వస్తే బాగుంటుందని చేసిన ప్రార్ధనలకు భగవంతుడి మనస్సుని కూడా కదిలించకలేక పోయింది. చివరికి వెన్నలాంటి సాన్వి చిరునవ్వు కూడా హంతకులను కరిగించలేకపోయింది. దాంతో గత కొద్ది రోజులుగా ప్రవాస భారతీయులనే కాకుండా, భారతీయులందర్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిన సాన్వి కిడ్నాప్ వ్యవహారం అత్యంత విషాదంగా ముగిసింది.
సాన్వి .. పట్టుమని పది నెలలైనా కాలేదు ఈ భూమి మీద పడి ! ఇంతలోనే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అమాయకమైన ముఖం, మేలిమి బంగరు ఛాయ. చురుకైన కళ్లు. చూడగానే ఎంతో ముద్దొచ్చే ఆ చిన్నారిని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. నాయనమ్మని హత్య చేసి పాపను అపహరించుకుపోయిన దుండగులు పాపను కూడా హత్య చేసి ఉంటారని ఎఫ్.బి.ఐ. సైతం ఊహించలేదు. పాపను ప్రాణాలతో కాపాడి తల్లిదండ్రులకు అప్పగించగలమనే ఎఫ్.బి.ఐ. ఈ నాలుగు రోజులూ విశ్వసించింది. కాని చివరికి పాప దక్కలేదు. పాప తల్లిదండ్రులు శివ ప్రసాద్, లత ఈ వార్త తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాని అందరి ఆశలూ శుక్రవారం ఉదయం ఆవిరైపోయాయి. పాప దారుణ హత్యకు గురైందని ఎఫ్.బి.ఐ. అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించేసరికి సభ్య సమాజం దిగ్భ్రాంతి చెందింది. పాప తల్లిదండ్రులతో పాటు అమెరికాలో ఉంటున్న తెలుగు కుటుంబాలన్నీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.
శుక్రవారం సాయంత్రం అమెరికా నలుమూలలా తెలుగు కుటుంబాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నాయి.ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు రఘు యండమూరి అని ఎఫ్.బి.ఐ. అధికారులు శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో వెల్లడించారు. సాన్వీని అపహరించుకుపోయిన ఈ వ్యక్తి కూడా కింగ్ ఆఫ్ ప్రష్యాలోని మార్కిస్ ఎపార్ట్మెంట్లోనే నివసిస్తున్నాడనీ, అతడు పాప నాయనమ్మను హత్య చేసిన అనంతరం చేతిరుమాలతో పాపకు ఊపిరి ఆడకుండా చేసి సూట్కేసులో ఇరికించేసి పాపను అపహరించుకుపోయినట్టు వెల్లడించారు.పాప గుండెమీదా, గొంతుపైనా కత్తిపోటు గుర్తులు ఉన్నట్టు ఎఫ్.బి.ఐ. వెల్లడించింది. పాపను అపహరించుకుపోయిన రఘు తనకు ఆ సాయంత్రానికే 50 వేల డాలర్లు చెల్లించాలంటూ ఒక లేఖను కూడా ఆ ఇంట్లో వదిలి వెళ్లాడని, అటువంటి లేఖలు పది ప్రతులు దొరికాయని ఎఫ్.బి.ఐ. అధికారులు వెల్లడించారు. పాప అపహరణ విషయం పోలీసులకు వెల్లడించవద్దన్న రఘు డబ్బు ఎప్పుడు, ఎలా చెల్లించాలో తమ మనుషులు చెబుతారని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఒక వేళ గనక పోలీసులకు పాప అపహరణ విషయం తెలియజేసినా, డబ్బు ఇవ్వకపోయినా పాపను ముక్కలు ముక్కలుగా చేసి ఇంటికి పంపిస్తానని కూడా రఘు యండమూరి ఆ లేఖలో పేర్కొన్నట్టు ఎఫ్.బి.ఐ. అధికారి వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more