మనుస్ర్ముతి.. పేరు వినగానే ఆ పేరు వెనుక చాలా చరిత్ర ఉందని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది మనుస్ర్ముతి అనే ఒక యువతి గురించి. ఆమె కుటుంబం గురించి. భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్ గ్రామానికి చెందిన ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. 1921లో మనుస్ర్ముతి ముత్తాత హరిహర్ ప్రసాద్ బీహార్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ గా చేరారు. అటు బ్రిటిష్ పాలనలోనూ, ఇటు భారత పాలకుల హాయంలోనూ పని చేసి 1954 లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే 1952లో ఆయన కుమారుడు అరవింద్ ప్రసాద్ పోలీసు సర్వీసులో జాయిన్ అయ్యారు. సబ్ – ఇన్ స్పెక్టర్ గా సర్వీసులో చేరిన ఆయన సుదీర్ఘ కాలం పని చేసి 1988 లో ఏఎస్పీ హోదాలో రిటైరయ్యారు.
అరవింద్ ప్రసాద్ పదవిలో ఉండగానే ఆయన కుమారుడు కమలేంద్ర ప్రసాద్ పోలీసు సర్వీసులో చేరారు. 1981లో ఉత్తర ప్రదేశ్ కేడర్ లో ఐపీఎస్ అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు హోదాల్లో పని చేసి, ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్సెస్ కు డైరెక్టరుగా కొనసాగుతున్నారు. పూర్వం నుంచి పోలీసు కుటుంబం కావడంతో వారి పిల్లలకు కూడా ఆ జాబ్ పై మమకారం ఏర్పడింది. ఆ దిశగా వారి అడుగుల పడ్డాయి. అలా నాలుగోతరానికి చెందిన కమలేంద్ర ప్రసాద్ కూతురు మనుస్ర్ముతి కూడా ఐపీఎస్ కు ఎంపికయ్యారు. 2011 లోశిక్షణ పూర్తి చేసుకుని ఇటీవల ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇలా 90 సంవత్సరాలుగా ఆ కుటుంబం పోలీసు వ్యవస్థలో పని చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విధంగా ఒకే కుటుంబం ప్రపంచంలో ఎక్కడా ఇన్నేళ్లు పోలీసు వ్యవస్థలో పనిచేయలేదు. అయితే , ఐపీఎస్ గా చేరిన కొంతకాలానికి గాని మనుస్ర్ముతి కి ఈ విషయం తెలియకపోవడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more