బాగా పని చేసేవారికి ప్రోత్సాహం! పనిచేయని వారికి తిరస్కారం! ఇది కేంద్ర ప్రభుత్వ తాజా ఆలోచన! ఆరో వేతన కమిషన్ సిఫారసు చేసిన... పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (ప్రిస్) కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సూత్రప్రాయంగా ఆమోదించింది. దీనిని అమలు చేసే దిశగా కదులుతోంది. అటు... పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా పథకాన్ని రూపొందించింది. అయితే... పని తీరును బట్టి ప్రోత్సహించడంతోపాటు పనిచేయని వారికి 'శిక్ష' విధించాలని కూడా కేంద్రం భావిస్తోంది.దీనిని అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు వర్తింప చేయాలని యోచిస్తోంది. కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఈ అధికారుల పని తీరును సమీక్షించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ ఈ పని చేస్తోంది. విధి నిర్వహణ తీరు ఏమాత్రం సంతృప్తికరంగాలేని అధికారులకు 'నిర్బంధ పదవీ విరమణ' అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
"అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరును సమీక్షించే ప్రక్రియ కేంద్ర స్థాయిలో ఇప్పటికే మొదలైంది. ఈ కసరత్తు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచించాం. ఆరు నెలల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారికి చెక్ చెప్పడమే మా ఉద్దేశం'' అని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అఖిలభారత సర్వీసు అధికారుల సేవలను మాత్రమే సమీక్షించే వారు.పనితీరు బాగలేదని తేలితే... నిర్బంధ పదవీ విరమణ అమలు చేసే వారు. ఈ ఏడాది జనవరిలో దీనికి సంబంధించిన నిబంధనలను సవరించి గడువును 15 సంవత్సరాలకు తగ్గించారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులు 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వెంటనే తొలి పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరి పని తీరు బాగా లేకపోతే ప్రజా ప్రయోజనాల రీత్యా ఆ అధికారిని నిర్బంధంగా ఇంటికి పంపే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. తొలి పరీక్ష నెగ్గితే... తిరిగి 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాక లేదా 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మరో విడత ఆ అధికారి పనితీరును సమీక్షిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more