అనుబంధాలను ప్రశ్నార్థకం చేసే ఘటన ఇది. భారతీయ సమాజం ఎటు వెళ్తోంది? అన్న సందేహాన్ని కలిగించేది. పంజాబ్ రాష్ట్రంలోని కంజ్లా గ్రామానికి చెందిన మన్ ప్రత్ కౌర్ అనే 19 సంవత్సరాల బాలిక ప్రేమించిన వాడిని పెళ్లాడతానంటే తల్లిదండ్రులు , సొదరుడు సమ్మతించలేదు. ఎందుకంటే మన్ ప్రీత్ ప్రేమించిన గుర్మీత్ సింగ్ వేరే కులానికి చెందినవాడు కావడంతో పాటు.. అప్పటికే అతడికి వివాహం కూడా అయింది. కానీ , ప్రేమలోకంలో మునిగిపోయిన మన్ ప్రీత్ తల్లిదండ్రుల తిరస్కరణకు తట్టుకోలేకపోయింది. వారిని చంపడానికి కిరాయి హంతుకులతో చేతులు కలిపింది. వారి అద్రుష్టం బాగుండి వారు బతికిపోగా.. మన్ ప్రీత్ హంతక ముఠా పోలీసులకు చిక్కింది. కంజ్లా గ్రామంలో సెల్ ఫోన్ రిచార్జీ షాపు నడుపుతున్న గుర్మీత్ ప్రేమలో మన్ ప్రీత్ పడిపోయింది. అప్పటికే వివాహితుడైనా..గుర్మీత్ తన అవసరాల కోసం మాయ మాటలతో మన్ ప్రీత్ ను వలలో వేసుకున్నాడు. దాన్నే ప్రేమగా భావించిన మన్ ప్రీత్ గుర్మీత్ ను పెళ్లాడతానని కన్నవారి దగ్గర మంకు పట్టుపట్టింది. ఎందుకైనా మంచిదని ఆమెను స్కూల మన్పించారు. అదే పెద్ద నేరం అవుతుందని వారప్పుడు భావించలేదు. దీంతో మన్ ప్రీత్ మనసులో విషబీజం మొలకెత్తింది. జన్మనిచ్చిన అమ్మానాన్నలతో పాటు తోడబుట్టిన వాడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. వారిని చంపడానికి కిరాయి హంతకులను సంప్రదించింది. ఇందుకు మన్ ప్రీత్ వారికిచ్చిన ఆఫర్ రూ. 5 లక్షలు .హంతక ముఠా రంగంలోకి దిగింది. రెండు సార్లు వారు చేసిన యత్నాలు సఫలం కాలేదు. మూడోసారి మన్ ప్రీత్ ఇంట్లోకి అడుగుపెట్టిన హంతకులు ముందుగా ఆ ఇంట్లో పని చేసే జర్నైల్ సింగ్ ను కాల్చి చంపేశారు. అలికిడికి మన్ ప్రీత్ తండ్రి నిద్రలేవడంతో హంతకులు పరార్ . ఆ మరుసటి రోజు పోలీసులు మన్ ప్రీత్ ఇంటి ఆవరణ లో జర్నైల్ సింగ్ శవం 315 తుపాకీ, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరి కుట్ర బయటపడింది. నిందితులందరూ పోలీసులకు చిక్కారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more