మూఢాచారాలపై అనేక స్వచ్చంధ సంస్థలతో పాటు ప్రభుత్వాలు ప్రజలలో అవగాహన పెంచేందుకు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా అవి కాగీతాలకే పరిమితమవు తున్నాయనడానికి ఇలాంటి ఘటనలే సాక్ష్యం. మూఢాచారాలపై నేటికీ ప్రజల్లో విశ్వాసం బలంగా వుందని చెప్పకతప్పదు. మహబూబ్ నగర్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు మహిళలు చేతబడి చేశారనే నెపంతో గ్రామస్తులు పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో భయాందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెల్సుకుని వెళ్లిన పోలీసులను సైతం గ్రామస్తులు అడ్డుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలపై చైతన్యపరిచేందుకు వెళ్లిన కళాబృందాన్ని సైతం అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.
జిల్లాలో నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఆధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అలాగే జిల్లాలోని నల్లమల ఆటవీ ప్రాంతమైన బల్మూరు, ఉప్పునుంతల మండలాలతో పాటు రాష్ట్ర రాజధానికి చేరువలో వున్న అమనగల్లు, వంగూరు మండలాలో కూడా ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆధికారులు హంగామా చేయడం మినహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. గతంలో మూడనమ్మకాలపై రెవెన్యూ, పోలీసు ఆధికారులు వీధి నాటకాలతో ప్రదర్శనలు ఇస్తూ ప్రజలల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేసేవారు. ఇందుకు పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆధికారులు ప్రత్యేక చొరవ తీసుకోకపోవడం వల్ల మూఢనమ్మకాలు ప్రజల్లో పెచ్చురిల్లుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవచూపకపోతే గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేకుండా పోతుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more