శుక్రవారం రాత్రి నుండి ఏకథాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది. నిన్న సాయంత్రం వరకూ 223మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో సగటు కంటే 12శాతం, తెలంగాణలో ఒక శాతం అధికంగా నమోదు కాగా రాయలసీమలో ఆరు శాతం తక్కువగా నమోదైంది. అటు భారీగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది. జిల్లాలో ఇప్పటివరకూ సగటున 21సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లక్కవరం సరస్సులో నీటి సామర్థ్యం 34అడుగులు కాగా ప్రస్తుతం 24అడుగుల మేర నీరు చేరింది. పలు మండలాల్లో చెరువులు, కుంటల్లో నీటిమట్టం పెరిగింది. మెదక్ జిల్లాలో భారీ వర్షానికి ఓ పాఠశాల భవనంలోని గది కూలిపోయింది. మానూర్ జిల్లా పరిషత్ పాఠశాల గది కూలడంతో విద్యార్థలకు సెలవు ప్రకటించి ఇళ్ళకు పంపించేశారు. ఇక నల్లగొండ జిల్లాలో నాలుగురోజులనుంచి కురిసిన వర్షాలకు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి నల్గొండ పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విరామం లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షంతో జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదిలాబాద్ పల్లెల్లో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు.
ఇన్ని రోజులు వర్షం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అన్నదాతలు ఆగకుండా కురుస్తున్న వర్షాలతో నాగలి చేతబట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గుంటూరు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి డివిజన్ లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నిన్న సాయంత్రానికి 17మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని స్థంబింప జేసింది. వర్షపు నీరు రోడ్లపై నిలబడి పోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో కర్నూలు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోనే నంద్యాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం స్థంబించింది. చలిగాలులకు జనం వణికిపోయారు. చిప్పగిరి మండలం నగరడోన సమీపంలోని వాగులో కారు, ఆటో కొట్టుకుపోయాయి. సుమారు పది మంది గల్లంతైనట్లు సమాచారం. రాయలసీమలో కరువు ప్రాంతంగా ముద్రపడిన అనంతపురం వరుణుడి రాకతో పులకించిపోయింది. గంటల తరబడి వర్షం కురవడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more