క్రిష్ణ జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై బహిరంగ విమర్శలు చేశారు. టీడీపీ పార్టీ నుండి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో నాని బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంజాయిషీ అడక్కుండానే తనను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు. దీని పై కోర్టుకు వెళతానని నాని అన్నారు.
నేను చంద్రబాబు నాయుడిని చూసి తెలుగు దేశం పార్టీలో చేరలేదని, తెలుగు జాతి అన్నగా పిలువబడే పెద్ద ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో పార్టీలో చేరానని, ఆయన పై అభిమానంతోనే గుడివాడ ప్రజలు నన్ను గెలిపిస్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ చేయబట్టే నాకు రెండు సార్లు ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చిందని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొత్తు కాదని, ఆయన అభిమాని అయిన తనను పార్టీ నుంచి గెంటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగా ఉండగా పార్టీ బాగుపడదని కొడాలి నాని అన్నారు. తన సస్పెన్షన్ పై న్యాయ పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబుతో పాటు తనపై ఆరోపణలు చేసిన వారంతా బహిరంగ క్షమాపణ చెప్పాలని నాని డిమాండ్ చేశారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి, బహిరంగ క్షమాపణ చెబితే తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానన్నారు. ఒకవేళ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే వైఎస్ జగన్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాబు రాజ్యసభ సీటును రూ.300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. డబ్బులకు అమ్ముడపోయే వ్యక్తినే అయితే తాను వైఎస్ఆర్ హయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేవాడినని నాని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దేవినేని ఉమ తన తమ్ముడిని ఎంతకు అమ్మారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు. మరి ఈ విమర్శల పై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more