రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.. ఈ మాటలు పోలీస్ బాస్ దగ్గర నుంచి ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కాని చేతల్లో మాత్రం ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం నేర ప్రవుత్తిలో అగ్రస్థానంలో ఉంది. బ్యూరో రికార్డ్ 2011ప్రకారం అక్షరాలా లక్షా 89వేల 780కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 23జిల్లాలలోని 33పోలీసు కేంద్రాలలో ఈ కేసులు నమోదయ్యయి. ఇందులో వరకట్న వేధింపులు అంటే భర్త అతని బంధువులు చేతిలో వేధింపులకు గురై సెక్షన్ 498ఏ కింద 13వేల 376కేసులు నమోదయ్యాయి.
మహిళలపై అత్యాచార ప్రయత్నం సెక్షన్ 509 క్రింద 3వేల 658కేసులు, అత్యాచారానికి గురైనవారు సెక్షన్ 354క్రింద 4వేల 849 కేసులు, వరకట్న మరణాలు 599, అత్యధికంగా మారణాయుధాలతో దాడి చేసిన ఘటనల కేసులు 54వేల 452అపహారణలకు సంబందించి వెయ్యి 21కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా ఐ పి సి సెక్షన్ 379, 382 క్రింద 56వేల 534కేసులు, ఐ పి సి సెక్షన్ 419, 420క్రింద 9748కేసులు, సెక్షన్ 449, 452,454,455,457, 460క్రింద 8300కేసులు, ఐ పి సి సెక్షన్ 406, 409, క్రింద 1174కేసులు, ఐ పి సి సెక్షన్ 392, 394, 397, 398క్రింద 600కేసులు నమోదైనట్టు పెర్కొంది. రాజధాని నగరం క్రైం రికార్డ్ లోను అగ్రస్థానంలో నిలిచింది. హత్యనేరాలు అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాదు కమిషనరేట్ పరిథిలో 340నమోదయ్యయి. తరువాత మహబుబ్ నగర్ జిల్లాలో 188కేసులు, కర్నూలు జిల్లాలో 153, తరువాత కరీంనగర్ జిల్లాలో 150కేసులు, మెదక్ జిల్లాలో 141కేసులు నిజమాబాదు జిల్లాలో 135కేసులు, కడపలో 120కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని చెప్పుకుంటున్నా నాయకులకు అలాగే తాము ఎంతో గొప్పలు చేస్తున్నామని చెప్పుకుంటున్నా పోలీసు శాఖ పని తీరు ఏలా ఉందో తెలియజేసేందుకు గణాంకాలు ప్రబల సాక్షంగా నిలుస్తున్నాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more