నాగార్జున అగ్రికమ్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు శ్రీకాకుళం ఆర్డీవో (ఆదివారం) ఈ ఉదయం ప్రకటించారు. దీంతో చిలకపాలెంలోని పొందురు రోడ్డుపై ప్రజలు చేపట్టిన ఆందోళనని విరమించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఈ ఫ్యాక్టరీ తెర వద్దని శ్రీకాకుళం కలెక్టర్ ఆదేశించారని శ్రీకాకుళం ఆర్డీవో వెల్లడించారు. అగ్రికమ్ ఫ్యాక్టరీలో శనివారం రియాక్టర్ నేలి 18 మంది తీవ్ర గాయాలు పాలైన సంగతి తెలిసిందే.
కాగా, శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమ పేలుడులో క్షతగాత్రుల సంఖ్య 16కు చేరుకుంది. చిలకపాలెం సమీపంలోని అగ్రికెమ్ పరిశ్రమలో నిన్న ఉదయం ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని 5వ బ్లాక్ లో పేలుడు సంభవించింది. కెమికల్స్ తయారు చేసే ఐదో బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగసి పడ్డాయి. మంటలు క్రమంగా మూడు నాలుగు బ్లాకులకు వ్యాపించాయి. పరిశ్రమ చుట్టూ దట్టమైన పొగలు, విషవాయువులు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిశ్రమ యాజమాన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విషవాయువులు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తాయన్న భయంతో అక్కడి ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం జరిగిన బ్లాకులో మరికొన్ని రియాక్టర్లు ఉండగా వాటికి మంటలు చెలరేగకపోవడంతో భారీ ముప్పు తప్పిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ లో మొత్తం 60మంది కార్మికులు ఉండాల్సి ఉండగా 40మంది వరకు అల్పాహారం కోసం బయటకు వెళ్లడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. అటు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు విషవాయువులు పీల్చిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విశాఖకు తరలించి వైద్యం అందిస్తున్నారు. రియాక్టర్ వేడి 180డిగ్రీలు దాటాక కూడా దాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం ఎయిర్, వాటర్, సాయిల్ సాంపిల్స్ ను హైదరాబాద్ కు తరలించినట్లు పొల్యూషన్, క్వాలిటీ కంట్రోల్ బోర్టు టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పారు. మరోవైపు పేలుడుపై విచారణ పూర్తయ్యేంత వరకు ప్లాంట్ ను లాకౌట్ ప్రకటించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more