రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 న 7000 ప్రైవేట్ నర్సింగ్ హోంలు, దాదాపు 15 వేల ప్రైవేట్ క్లినిక్లు మూసివేస్తున్నారు. కేంద్ర ప్రభత్వం చర్యలను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) పిలుపు మేరకు జాతీయ స్థాయి సమ్మెలో భాగంగా రాష్ట్రంలో ప్రైవేట్ వైద్యులు సమ్మెకు సన్నద్దమవుతున్నారు. సుమారు 70 వేల మంది వైద్యులు ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారు. ఐఎంఎ నేషనల్ లీడర్స్ ఫోరం చైర్మన్, స్పెషల్ యాక్షన్ కమిటి ఆల్ ఇండియా ఐఎంఎ స్ట్రైక్ చైర్మన్ డాక్టర్ ఎన్. అప్పారావు, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్. ప్రసాద్, ఐఎంఎ నాయకులు డాక్టర్ పి. పుల్లారావు, డాక్టర్ ఎం. యాదగిరిరావు, డాక్టర్ జయరాజ్ తదితరులు మాట్లాడుతూ, తప్పని సరిపరిస్థితిలో సమ్మె చేపడుతున్నామన్నారు.
25 న ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సమ్మె జరుగుతుందని, ఈ సమయంలో అత్యవసర కేసులను సమ్మె నుండి మినహాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లందరికీ ఈ మేరకు సమాచారం అందించామన్నారు. ప్రభుత్వ డాక్టర్లు కూడా ఐఎంఎ చేపట్టిన సమ్మెకు మద్ధతు ప్రకటించారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అంశాలను ఐఎంఏ వ్యతిరేకిస్తోందని అప్పారావు, ప్రసాద్ తదితరులు తెలిపారు. డాక్టర్లతో కూడిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) స్థానంలో డాక్టర్లు కాని వారి నేతృత్వంలో నేషనల్ కమిషన్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఫర్ హెల్త్ (ఎన్సిహెచ్ఆర్సి) ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ ఆలోచన సరైంది కాదని, అందువల్ల ఈ తరహా చట్టాన్ని తీసుకురాకూడదని, ఈ మేరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎన్సిహెచ్ఆర్సి బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (సిఇ) చట్టాన్ని రద్దు చేయాలని, దీనివల్ల చిన్న చిన్న ఆసుపత్రులను నడపలేని పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సిఇ చట్టాన్ని కొనసాగించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more