బరితెగించిన ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారులపై కూడా దాడులకు పాల్పడటం సర్వసాధారణమైంది. జగ్గయ్యపేట తహశీల్దార్ మదన్మోహన్, సర్వేయర్ శ్రీనివాసరావులపై హత్యాయత్నానికి ఒడిగట్టిన సంఘటన మండలంలోని ధర్మవరప్పాడుతండా సమీపంలో రాత్రి జరిగింది. ధర్మవరప్పాడు తండా సమీపంలో అక్రమంగా గ్రావెల్ క్వారీ నిర్వహణ జరుగుతుందన్న సమాచారం మేరకు తహశీల్దార్ మదన్మోహన్ సర్వేయర్ శ్రీనివాసరావును వెంట బెట్టుకొని బైక్పై అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఒక జెసిబి, ఒక ట్రాక్టర్ను వారు గుర్తించారు. అనంతరం వేదాద్రి, రావిరాల ఇసుక క్వారీల పరిశీలన నిమిత్తం వెళుతుండగా మార్గమధ్యలో వారికి ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురైంది. దాన్ని పట్టుకున్న తహశీల్దార్ జగ్గయ్యపేట రెవెన్యూ కార్యాలయానికి తరలించే ఏర్పాటు చేసి ముందుకు వెళ్లారు. వారికి మరి కొద్ది దూరంలో మరొక ఇసుక ట్రాక్టర్ ఎదురుకాగా దాన్ని ఆపేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ను అపకుండా తమ బైక్పైకి దూసుకువచ్చినట్లు తహశీల్దార్ తెలిపారు.
కొంత దూరం ట్రాక్టర్ను వెంబడించిన తహశీల్దార్, సర్వేయర్ పదేపదే ట్రాక్టర్ మీదకు రావడంతో తప్పించుకొని వేరే మార్గంలో వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత గ్రామంలోని ప్రధాన రోడ్డుపైకి వచ్చి ఇసుక ట్రాక్టర్ను పట్టుకొని చిల్లకల్లు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ట్రాక్టర్పై యజమాని గుగులోతు తావూరియా, డ్రైవర్ బాణావత్ రాంబాబు ఉన్నారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు మండలానికి చెందిన ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడివిగా తెలుస్తోంది. విషయం తెలుసుకొని డిటి బుల్లిబాబు, పిడిఎస్ డిటి భోజరాజు, విఆర్ఒ, రెవెన్యూ సిబ్బంది చిల్లకల్లు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యాయత్నం, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకున్న కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసన్నవీరయ్యగౌడ్ తెలిపారు. దాడికి సంబంధించిన సమాచారాన్ని రెవెన్యూ సిబ్బంది సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more