శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లు కొలువుదీరిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి కోటి కుంకుమార్చన, కోటివర్తి దీపారాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 21వరకు వైభవంగా జరిగే ఈ మహోత్సవాలను పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతీస్వామి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించారు. ఉదయం 6గంటల సమయంలో ప్రధాన ఆలయం నుంచి దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య భవానీదీక్ష మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక ఆసనంపై ప్రతిష్ఠించి హారతులిచ్చారు. ఇక్కడ నిత్యం ఉదయం 8నుంచి 11గంటల వరకు కుంకుమార్చన జరుగుతుంది. ఇక రాజగోపురం ఎదురుగా శ్రీ మల్లికార్జున మహా మండపంలో ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన జరుగుతుంది. కుంకుమ సువాసినీలకు అతి ముఖ్యమైన అలంకారం. ఏ ఆభరణం లేకపోయినా నుదుట కుంకుమ ధరించిన స్ర్తి విలక్షణమైన శోభతో పూజ్యురాలుగా నిలుస్తుంది. స్ర్తిమూర్తి దుర్గాదేవికి కుంకుమ చాలా ప్రియమైనది. మహిషాసురమర్దిని అవతారంలో దుర్గమ్మ మహా రౌద్రంగా ఉండేది. అటువంటి రౌద్ర స్వరూపిణిని పరమ శాంతిస్వరూపిణిగా మార్చాలనే సంకల్పంతో శ్రీ శంకరాచార్యులు ఇక్కడకు వచ్చి అమ్మ సన్నిధిలో శ్రీచక్ర యంత్రాన్ని స్వయంగా ప్రతిష్ఠించారు. నాటినుంచి దుర్గమ్మ భక్తులకు కొంగుబంగారంగా, శాంతిస్వరూపిణిగా మారింది. నాటి నుంచి దుర్గమ్మను నిత్యం లలిత సహస్ర నామాలతోనే అర్చిస్తున్నారు. ప్రస్తుతం కోటి కుంకుమార్చన పేరుతో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఆలయ ఇఓ ఎం రఘునాథ్ నిర్వహిస్తున్నారు.
అయితే ఒకరోజు కుంకుమార్చనలో పాల్గొనేందుకు 2,500 రూపాయలు, లేదా 31రోజులు గోత్రనామాలతో పూజ జరిపించుకోడానికి 5వేల రూపాయలు ఫీజుగా అధికారులు నిర్ణయించారు. దీన్ని కొంత ఆర్థిక భారంగానే భక్తులు భావిస్తున్నారు. ఇక కోటివర్తి దీపారాధనకు 50వేల రూపాయలు రుసుముగా నిర్ణయించారు. అయితే ప్రమిద నూనె వత్తులను ఆలయ అధికారులే సమకూరుస్తున్నారు. దీపాల వెలుగులో విమాన స్వర్ణగోపురం ధగధగలను 3వేల మంది భక్తులు ఏకకాలంలో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీపంలో కన్పించే ఎర్రని కాంతి సృష్టికర్త బ్రహ్మదేవునికి, నీలి రంగు విష్ణు భగవానునికి, తెల్లని కాంతి పరమ శివునికి చిహ్నంగా చెబుతారు. ఇళ్లలో దీపారాధనలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. భక్తులు చేసే ఉపచారాల్లో దీప సమర్పణ ముఖ్యమైనది. దీపాల వెలుగుతో శక్తిని, విజ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని అందించే దుర్గాదేవిని సరస్వతి, మహాలక్ష్మిదేవిగా కూడా భక్తులు ప్రత్యేకంగా కొలుస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more