స్వపక్షీయులే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దెబ్బతీశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గతంలో మాదిరి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఘోరంగా ఓడించిన ఘనత పార్టీ నాయకులదేనట. శ్రేణులన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలో నిలబెట్టాయంటే, నియోజకవర్గంలో నాయకత్వం ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మనోళ్ళే పార్టీని ముంచేశారంటూ మొన్నటి ఎన్నికల్లో కూడా ఓటమి పాలైన గంటెల సుమన ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. పాయకరావుపేట ఉపఎన్నికల ఫలితాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్థానిక సర్క్యూట్ హౌస్లో సమావేశమై సమీక్షించుకున్నారు.
కాంగ్రెస్కు మంచి పట్టు ఉన్న తంగేడులో కాంగ్రెస్ పార్టీకి కేవలం 115 ఓట్లు వచ్చాయంటే, అక్కడి కేడర్ ఏవిధంగా పనిచేసిందో ఇట్టే చెప్పేయచ్చు. ఈవిషయం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ, రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టినట్టు ప్రజలు నమ్ముతున్నారని నాయకులు భావించారు. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారి స్థానాలను భర్తీ చేయకపోవడం వలన కూడా పార్టీకి తీవ్రనష్టం వాటిల్లిందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికలో అభ్యర్థిని ప్రకటించడం ఆలస్యం కావడం కూడా పార్టీ ఓటమికి కారణమని భావించారు. గ్రామాల వారీగా, బూత్ల వారీగా ఓట్ల వివరాలను తెప్పించుకుని ఓటమికి గల కారణాలను విశ్లేషించాలని నిర్ణయించారు. అలాగే అర్బర్, రూరల్ జిల్లా కమిటీ సమావేశాలను త్వరలోనే ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. నామినేటెడ్ పోస్ట్ల భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణులను మళ్లీ బలోపేతం చేయాలని కూడా నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more