ఆర్థిక మాంద్యం దెబ్బ అంటే ఏంటో చూపిస్తుంది. దీని పై ప్రభావం వివిధ రంగాలపై చూపించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ బహుమతి పై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. వివిధ రంగాలలలో చేసిన విశేష క్రుషికి గుర్తింపుగా నోబెల్ బహుమత్రి ప్రధానం చేస్తారు. ఈ బహుమతి తో పాటు కొంత మొత్తాన్ని కూడా నగదు రూపంలో ఇస్తారు. కానీ ఈసారి ఇచ్చే నోబెల్ బహుమతి విజేతలకు గత ఏడాదికన్నా 20 శాతం తక్కువ సొమ్మును అందిస్తామని నోబెల్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. నిన్న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో బహుమతి మొత్తాన్ని 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల నుంచి 8 మిలియన్ క్రోనార్లకు తగ్గించాలని నిర్ణయించారు.
నోబెల్ ఫౌండేషన్ ద్వారా వైద్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని అందజేస్తున్నారు. డైనమేట్ను కనిపెట్టిన ఆల్ ఫ్రెడ్ నోబెల్ విల్లు ద్వారా వస్తున్న సొమ్ము నుంచి ఏటా నోబెల్ బహుమతులను అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతోందని ఫౌండేషన్ చైర్మెన్ హెకెన్స్టన్ ఆందోళన వ్యక్తం చేశారు. బహుమతి సొమ్మును తగ్గించడం వల్ల నోబెల్ బహుమతి ప్రశంస ఏ మాత్రం తగ్గదని ఆయన అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more