సిబిఐ వారు జగన్ ను ఏ ప్రశ్న అడిగిన అన్నింటికి ఒకటే సమాధానం చెప్పటంతో.. సిబిఐ ఆశ్చర్యపోతున్నారు. జగన్ నవ్వుతూ.. అన్నీ ఆ విజయ సాయిరెడ్డికే తెలుసు అంటూ చిన్న చిరు నవ్వుతూ సమాధానం చెబుతున్నారని సిబిఐ అధికారులు అంటున్నారు. జగన్ ను నుండి సిబిఐ వారు ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా రాబట్టలేకపోతున్నారు. అందుకు సిబిఐ జగన్ కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సిబిఐ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. నార్కో పరీక్ష నిర్వహిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని సిబిఐ పగ్గాలు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఇందుకోసం సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు అనుమతించిన మేరకు రెండు రోజుల కస్టడీ ముగినప్పటికీ తన కంపెనీల్లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు, మనీ ల్యాండరింగ్ విషయాలను జగన్ వెల్లడించలేదని తెలిసింది. ఏ ప్రశ్న వేసినా అంతా విజయ సాయిరెడ్డికే తెలుసునని సమాధానాలు ఇచ్చినట్లు సిబిఐ సమాచారం.
దీంతో నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేందుకుగాను అనుమతి కోరుతూ న్యాయ స్థానంలో పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. చంచల్గూడ జైలు నుంచి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి తరలించిన జగన్ను జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ పదిన్నర నుంచి సాయంత్రం అయిదున్నర గంటల వరకు ప్రశ్నించినప్పటికీ ఎలాంటి సమాధానాలు రాబట్టలేకపోయారని తెలిసింది. ఏ ప్రశ్న వేసినా విజయసాయిరెడ్డికే తెలుసునని చెప్పినట్లు తెలిసింది. మారిషస్, లక్సెంబర్గ్ దేశాలతో పాటు మరో నాలుగు దేశాల నుండి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై, కోల్కతా, ముంబాయి, చెన్నై, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన పెట్టుబడులపై అడిగినట్లు సమాచారం. విదేశీ పెట్టుబడులపై సమాచారాన్ని తెలుసుకునేందుకు సిబిఐ అధికారులు లెటర్ ఆఫ్ రెగోరేటరీ పంపినట్లు తెలిసింది. ఏ-2 నిందితుడు విజయసాయిరెడ్డి విచారణకు సహకరించలేదంటూ నార్కో పరీక్ష చేయించేందుకు సిబిఐ అనుమతి కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. మరి ఇప్పుడు జగన్ విషయంలో ఎలా స్పందిస్తారో!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more