విశాఖపట్నంలో (ఆదివారం) ఇవాళ ఉదయం కలకలం బయలుదేరింది. సముద్రం పొంగుతున్నట్లు, అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లు వార్తలు దావానలంలా వ్యాపించాయి. దీనితో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భాయందోళనలకు గురయ్యారు. రామకృష్ణ బీచ్లో ఉదయం అలలు ఎగసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పెదవాల్తేరు వద్ద సముద్రపు నీరు పోటెత్తి మత్స్యకారుల నివాసాల్లోకి చేరడంతో స్థానికుల్లో 'సునామీ' అలజడి చెలరేగింది.
ఇదిలా ఉంటే, కడపజిల్లాలో మరో వార్త సంచలనం రేకెత్తించింది. అమ్మవారి ఆకారంలో చెట్టు అంటూ ఓ వార్త కలకలం రేపింది. కడప జిల్లా రైల్వేకోడూరులో అమ్మవారి ఆకారంలో చెట్టు కనిపిస్తోందన్న వదంతి దావానంలా వ్యాపించింది. పాతబజారులో వెలసిన గంగమ్మనది దగ్గర ఉన్న చెట్టుపై అమ్మవారి మొహం, చేతులు, శూలం దర్శనమిస్తున్నాయనే వార్త రావడంతో.. జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. గత నెల 23న గంగమ్మ జాతర నిర్వహించగా.. జాతర తర్వాత పదమూడో రోజు అమ్మవారి దర్శనం అవుతుందని భక్తులు చెప్పారు. పెద్దఎత్తున భక్తులు చేరుకోవడంతో.. స్వల్ప తొక్కిసలాట జరిగింది.
ఈ సంఘటనలు ఇలా ఉండగా, తిరుమల శ్రీనివాసుని ఉత్సవమూర్తికి మరో జత బంగారు కవచాలను తయారు చేయించేందుకు టిటిడి యాజమాన్యం చర్యలు చేపట్టింది. దాదాపు 40లక్షల రూపాయల వ్యయంతో స్వామివారికి కొత్త జతను చేయించాలని నిర్ణయించినట్లు టిటిడి ఈవో తెలిపారు. ప్రతియేటా జ్యేష్టమాసం, జ్యేష్టా నక్షత్రం రోజున ఉత్సవమూర్తులకు ఉండే కవచాలను మరమ్మతు చేయించడం ఆనవాయితీ. అయితే కొన్నేళ్లుగా స్వామి, అమ్మవార్లకు అలంకరిస్తున్న బంగారు కవచాలు అరిగిపోవడంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more