ముప్పేట దాడికి జగన్ తో సహా అతని జట్టు కుదేలవుతోంది. ఇప్పుడు వై.ఎస్.జగన్ ఆస్తుల కేసు ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసు ఇటు జగన్ అస్మదీయులను అటు అధికారంలో ఉన్న మంత్రులను కూడా ఇరకాటంలో పడేస్తోంది. ఓ వైపు ఈడీ మరోవైపు సీబీఐ దర్యాప్తు కూడా ముమ్మరం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో?. ఎవరికి ఎవరి నుంచి పిలుపు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ పరిణామాలు మంత్రులతోపాటు జగన్ శిబిరంలో కలకలం సృష్టిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఆ పార్టీనేతలకు. ఓ వైపు సీబీఐ, మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తమ విచారణను ముమ్మరం చేశాయి. ఈ కేసులో మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యను సీబీఐ విచారించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇద్దరు మంత్రులకు రేపో మాపో నోటీసులు జారీ చేయనుంది. పరిశ్రమలకు నీటి కేటాయింపులు జలయజ్ఞం టెండర్లపై సీబీఐ విచారించే అవకాశం వుంది. అయితే సీబీఐ నుంచి తనకెలాంటి సమన్లు అందలేని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కేటాయింపులన్నీ చట్టబద్ధంగానే జరిగాయన్నారు. సీబీఐ పిలిస్తే విచారణకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. మేకపోతు ఘాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన జగన్ వర్గం మదన పడుతున్నట్లు తెలుస్తొంది.
కాగా, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాలని సీబీఐ ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు... సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లు తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఆయా కేసుల్లో నిందితులకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిపించాలని భావిస్తోంది.
ప్రతిపక్షాలు ఈ అంశపై స్వరంపెంచాయి. జగన్ కేసును విచారిస్తున్న సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని టీడీపీ డిమాండ్ చేసింది. జగన్ కు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను టీడీపి టార్గెట్ చేసింది. మంత్రులను మంత్రుల్లా కాకుండా నిందితులుగా పరిగణించి విచారించాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సీబీఐని కోరారు. సీబీఐ, ఈడీ విచారణతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలతో జగన్ శిబిరం ఉక్కిరిబిక్కిరవుతోంది. జగన్ ఆస్తుల కేసు వారికి రోజుకో కష్టాన్ని తెచ్చిపెడుతోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more