ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కణేకల్, బొమ్మనహాళ్ మండలాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన మాట్లాడుతూ వ్యాపారాలు చేసే నాయకులకు ఓట్లేయవద్దన్నారు. ప్రజలకు సేవచేసే నాయకులనే ఎన్నుకోవాలని సూచించారు.ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేయకూడదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఒకవేళ ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేస్తే రాజకీయాల్లో వ్యాపారం మొదలవుతుంది. తద్వారా ప్రజలకు సేవచేసే నాయకులు కరువవుతారని అన్నారు. వైయస్ ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన ఘనత ఆయన కుమారుడు జగన్కే దక్కుతుందన్నారు. వేర్పాటువాద పార్టీ టిఆర్ఎస్, మతతత్వ బిజెపితో, వైయస్కు బద్ధశత్రువైన టిడిపితో కుమ్మక్కై వైయస్ ఆశయ సాధనకు జగన్ తూట్లు పొడుస్తున్నారన్నారు.
మామను మోసం చేసిన చంద్రబాబుకు, తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న జగన్కు ఏ మాత్రం తేడా లేదన్నారు. రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు వస్తాయన్నారు. 2014 వరకూ కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయిన తనకే కాపు రామచంద్రారెడ్డితో ఫోన్లో మాట్లాడడానికి వారం రోజుల సమయం పట్టేదన్నారు. ముఖ్యమంత్రి అయిన తనకే అందుబాటులోలేని ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారని ప్రశ్నించారు. మీ మీ ప్రాంతాల్లో సహజ సంపదను కొల్లగొట్టిన వ్యక్తికి ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాలరెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఒకవేళ ఆయన గెలిస్తే ఆయనతో పనిచేయించుకోవడానికి ప్రజలు నెల్లూరు వెళ్లాల్సి ఉంటుందన్నారు. వీరిద్దరూ వ్యాపారం నిమిత్తం, డబ్బు సంపాదన కోసం ఈ నియోజకవర్గానికి వచ్చిన వ్యక్తులని, ఇలాంటి వ్యక్తులకు మీరు ఓట్లేస్తారా? అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లే వ్యక్తికి ఓట్లు వేయడం వల్ల మీరు సాధించేది ఏమీ లేదన్నారు. స్థానిక అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్లను డబ్బుతో కొనాలనుకుంటున్న ఇలాంటి వ్యక్తులకు బుద్ది చెప్పాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more