ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో ప్రజలను బిజెపి మోసం చేసిందని విహెచ్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం ఇప్పటికే వందలాది మంది చనిపోయారని హనుమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై ఏర్పాటుకు తెలుగుదేశం తన మద్దతును తెలియచేసిన పక్షంలో తాము సోనియాగాంధీని ఒప్పిస్తామని కాంగ్రెస్ సభ్యుడు వి హనుమంతరావుచెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి బిజెపి సభ్యుడు ప్రకాష్ జావడేకర్ ప్రతిపాదించిన ప్రైవేట్ తీర్మానం వారం రోజుల విరామం తరువాత రాజ్యసభలో తిరిగి చర్చకు వచ్చింది. చర్చ ప్రారంభకాగానే బిజెపి సభ్యులు జై తెలంగాణ నినాదాల చేశారు. వెంటనే టిడిపి సభ్యులు దేవేందర్గౌడ్, గుండు సుధారాణి తమ బాణి కలిపారు.
బిజెపి, టిడిపిలు ద్వంద్వ నీతికి పాల్పడుతున్నాయని విహెచ్ చేసిన వ్యాఖ్యలపై దేవేందర్గౌడ్ మండిపడ్డారు. బిజెపి సభ్యులు ఒక అడుగు ముందుకేసి ‘మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన మేము తెలంగాణను ఇవ్వలేకపోయాం. మీరు ఇస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకుని కనీసం ఒక్క రాష్ట్రాన్ని ఇచ్చి నిరూపించుకోండి’ అని విహెచ్పై ఎదురుదాడికి దిగారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వెంకయ్యనాయుడు ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం బిజెపి ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని హోం మంత్రి చిదంబరంతో చెప్పిస్తే చంద్రబాబును తాము ఒప్పిస్తామని దేవేందర్గౌడ్ సవాల్ చేశారు. తన సవాల్ను స్వీకరించాలని అంటూ సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. ప్రతిపక్షాలు అడుగడుగునా అభ్యంతరం తెలుపుతున్నా విహెచ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పటికే ఆరొందల మంది చనిపోయారు, ఇంకంత మంది బలికావాలి? అని విహెచ్ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more