కాంగ్రెస్ పార్టీ రెండో సారి అదికారంలోకి వచ్చినప్పటి నుండి 2014 లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని తపన పడుతూ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయ్యింది. మొన్న జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో రాహుల్ గాంధీ ఏ మాత్రం తన ప్రభావం చూపలేకపోయాడు. ఒక రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రాలేక పోయిన వాడు దేశాన్ని ఎలా పరిపాలిస్తాడు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ 2014 సంవత్సరంలో అధికారంలోకి రావాలంటే అన్నింటికి చక్కబెట్టుకోవాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ ఓ ప్లాన్ వేసినట్లు సమాచారం.
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో యూపీఏ అభ్యర్థిని ఇప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ని రాష్ట్రపతి చేసి, కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న అపరచాణక్యుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని 2014 ఎన్నికల వరకు ప్రధానమంత్రి చేసి, ఉప ప్రధాని పదవి రాహుల్ కి కట్టబెట్టాలనే కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి కావాలి అంటే దీక్షాదక్షతలుండాలి. పాలనా నైపుణ్యం, ఏ సమస్యనైనా ఎదుర్కొనేంత శక్తి సామార్థ్యాలు కావాలి. ఇవన్నీ ప్రణబ్ ముఖర్జీకి ఉన్నందు వలన యూపీఏ కూడా ప్రణబ్ ని ప్రధాన మంత్రిని చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇలా చేస్తే ప్రణబ్ దాదా కోరిక తీరినట్లు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గాడిలో పడినట్లు అవుతుందని, రాహుల్ కి కూడా అనుభవం వస్తుందని యూపీఏ భావిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి ?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more