రాజకీయాలు నెరపి తెలంగాణలో కుట్రలు కుతంత్రాలకు జగన్ పాల్పడేందుకు యత్నిస్తున్నారని టీ జేఏసీ ఆరోపించింది. ఆంధ్రాలోవలే తెలంగాణ ప్రాంతంలో ఆటలు సాగుతాయనుకుంటే జగన్ పొరపడ్డట్టేనని నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన వైఎస్ అతని తనయుడు జగన్ ను ప్రజలు క్షమించరని వారు దుయ్యబట్టారు. అంతేకాదు.. పరకాల ఉప ఎన్నికల్లో సమైక్యవాదులకు స్థానం లేకుండా చేస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. ఇక్కడ పోటీకి సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీని నివారించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
"ఎన్నికలను ఉద్యమ వ్యూహంలో అంతర్భాగంగానే చూస్తున్నాం. గత మూడేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాద కుట్రలను ఎదుర్కొంటూ.. ప్రజలను ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్నాం. పరకాల ఉప ఎన్నికల్లోనూ సమైక్యవాద శక్తుల ఉనికి లేకుండా చేస్తాం'' అని చెప్పారు. పరకాల ఉప ఎన్నికల్లో పోటీ నివారించాలని టీఆర్ఎస్, బీజేపీలను కోరామని, మరోసారి కలిసి అభ్యర్థిస్తామని, ఇక్కడ రెండు పార్టీల తరఫున ఒకే అభ్యర్థి బరిలో ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. రెండు పార్టీల మధ్య పోటీ నివారించే యత్నాలు జరుగుతున్నాయని, అన్ని విషయాలను బయటికి చెప్పలేమని అన్నారు.
సమైక్యవాది జగన్ మానుకోట పర్యటనను అడ్డుకొని మే 28 నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. "కొండా సురేఖ సమైక్యవాద పార్టీ సభ్యురాలు. నాగం మాదిరిగా సమైక్యవాద పార్టీతో తెగదెంపులు చేసుకోవాలి. అలా కాకుండా ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. మరే పద్ధతిలో బరిలోకి దిగినా జగన్ పార్టీలో భాగమనేది జగమెరిగిన సత్యం'' అని అన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more