మరోవైపు ఐటి రంగంలో అభివృద్ధి విస్తరణ లోపించిందని, దెబ్బతిన్న ఐటి రంగానికి మార్గనిర్దేశనం చేసేందుకు పదిమంది ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ అనిశ్చితి, ఆందోళనలతో రాష్ట్రంలో ఐటి రంగం ఢమాల్ అయ్యింది. 2011-12 ఆర్థిక సంవత్సరం పూర్తయి నెల గడచినా, ఇంతవరకు ఐటి ఎగుమతుల విలువను చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాహసించడం లేదు. 1998లో 250కోట్ల రూపాయల విలువ చేసే ఐటి ఉత్పత్తులతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ఐటి మహా ప్రస్తానం చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తారాస్థాయికి చేరుకుంది. వైఎస్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఐటి రంగం కుదేలైంది. 2010-11లో ఐటి ఉత్పత్తుల ఎగుమతుల విలువ 36 వేల కోట్ల రూపాలయలకు చేరుకుంది. కాని 2011-12లో ఐటి ఉత్పత్తుల విలువ 40 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. సర్వసాధారణంగా పెరిగే విలువ తప్ప, గతంతో పోలిస్తే ఇది అభివృద్ధి కాదని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఐటి రంగంలో అభివృద్ధి మందగించిందని స్వయంగా అంగీకరించింది.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోని ఐటి కంపెనీల్లో మొత్తం 2.7 లక్షలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2014-15 నాటికి అదనంగా 1.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. 2014-15 నాటికి 70 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఐటి ఉత్పత్తుల ఎగుమతులు చేయాల్సి ఉంది. కానీ ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని తేలిపోయింది. 2009-10లో 32 వేల కోట్లు, 2010-11లో 36వేల కోట్ల రూపాయల వరకు ఐటి ఎగుమతులు జరిగాయి. ప్రస్తుతం పరోక్షంగా 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. నాస్కాం అంచనాల ప్రకారం సాలీనా 15 నుంచి 20 శాతం వృద్ధిరేటు ఉండాలి. నాస్కాం ప్రకారం రాష్ట్రం నుంచి ఐటి ఎగుమతుల విలువ 42 వేల కోట్ల రూపాయలు దాటాల్సి ఉంది.
హైదరాబాద్లో ఐటి రంగం అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల వౌలిక సదుపాయాలు ఉన్నాయి. చైనా, ఇండోనేషియా తర్వాత ఆ స్థాయిలో వౌలిక సదుపాయాలు ఉన్న నగరం హైదరాబాద్ కావడం విశేషం. గత ఏడాది కూడా అంతర్జాతీయ స్థాయిలో ఐటి రంగంలో పెట్టుబడులు ఇనెవస్ట్ చేసేందుకు అనువైన 9వ నగరంగా హైదరాబాద్ పేరు సంపాదించింది. కాని 2014-15 నాటికి 70 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఐటి ఉత్పత్తుల ఎగుమతులు చేయడం, అదనంగా 1.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం అసాధ్యంగా మారిందని ఐటి నిపుణులు అంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో అంచనాలకు మించి ఈ రంగంలో అభివృద్ధి జరిగి ఉండేది. కాని 2009-12 సంవత్సరాల మధ్య హైదరాబాద్తోపాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆందోళనల వల్ల ప్రభుత్వం కూడా ఏమీ చేయని స్థితిలో ఉండిపోయింది.
హైదరాబాద్లో 1300 వరకు ఐటి కంపెనీలున్నాయి. మాదాపూర్, గచ్చ్భిలి, కొండాపూర్లో ఐటి కంపెనీలున్నాయి. ఉప్పల్, పోచారం, షామీర్పేట, శంషాబాద్లో కొత్త ఐటి కంపెనీల ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలు ఆశాజనకంగా సాగడం లేదు. ఐటి రంగం కోసం 9 మిలియన్ల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
కాని కొత్త కంపెనీలు ఆశించిన రీతిలో తమ కార్యకలాపాలను ప్రారంభించడం లేదు. మహేశ్వరం, ఉప్పల్లో కేంద్రం సహకారంతో రెండు గ్రీన్ఫీల్డ్ ఐటి సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విశాఖపట్నం, తిరుపతి, వరంగల్లో కూడా ఐటి టూ టైర్ సిటీలుగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలకు స్పందన లేదు. గత ఏడాది మార్చి 1, 2 తేదీల్లో అడ్వాంటేజ్ ఏపి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఐటి రంగం అభివృద్ధి కోసం చేసిన సదస్సుకు పెద్దగా స్పందన కనపడలేదు. అధికార, విపక్ష రాజకీయ పార్టీల స్వప్రయోజనాలకు పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే వారిని ఇరికించడం, దర్యాప్తు ఏజన్సీలు రంగంలోకి దిగడం తదితర పరిణామాలు చూసి ఐటి, ఫార్మా రంగంలో పెట్టుబడులు ఇనెవస్ట్ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఒక వాణిజ్య పరిశ్రమల సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఇటీవల హైటెక్ సిటీలో మణికొండలో ఐటి కంపెనీలకు స్థలం కేటాయించిన భూమి ఒక మతానికి సంబంధించిన సంస్థ భూమిగా హైకోర్టు నిర్ధారించడంతో, అక్కడున్న కంపెనీలు ఖంగుతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా తమకు వివాదాలకు దారితీసే భూములను కేటాయించడంపై కూడా ఐటి కంపెనీలు కనె్నర్ర చేసినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more