సమన్వయం తో ముందుకెళ్లి.. ఉపఎన్నికల్లో కనీసం 9 స్థానాలు గెలవండని అధిష్టానం చేసిన సూచనలు కాంగ్రెస్ నేతల చెవికెక్కినట్లు కనబడటంలేదు. ఎప్పటిలాగనే కాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలకు...వీధి పోరాటలకు దిగారు. పరకాల సీటు దక్కకపోవడంతో గండ్ర అనుచరులు ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జ్యోతికి టికెట్ కేటాయించాలని నిరసనలతో హోరెత్తించారు.
అసమ్మతి సెగలు అటు అనంతపురం, గుంటూరు, వైజాగ్ లోనూ రాజుకుంటున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స ఆశీస్సులతో పాయకరావుపేట టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన మహిళ నేత విజయరావు గాంధీభవన్ ముందు బైఠాయించారు. సుమనకు టికెట్ ఇస్తే తము పనిచేసే ప్రసక్తిలేదని తెగిసి చెప్పారు.
అనంతపురంలో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో విదేశీ పర్యటనలకు కూడా వెళ్లనున్నారు. జెసి ఉప ఎన్నికలకు దూరంగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. రాయదుర్గం నియోజక వర్గంలో తన తమ్ముడు అల్లుడు దీపక్ రెడ్డి టిడిపి నుంచి పోటీ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో విదేశ పర్యటనకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు.
ఇక గుంటూరు జిల్లాలో కూడా అసంతృప్తి రగులుతోంది. జిల్లాలో సీనియర్ నేత గాదే వెంకట్ రెడ్డిని ఎన్నికల సమన్వయం కమిటీలో వేయకపోవడం. వైరీ వర్గాలుగా ఉన్న రాయపాటి, కన్న లక్ష్మినారాయణ వర్గాలు పార్టీ విజయంకోసం కలిసి పనిచేస్తాయా అనే అనుమానాలు ఉన్నాయి.
కడపలోనూ కాంగ్రెస్ నేతమధ్య విభేదాలు భగ్గుమన్నాయి. శాఖల కత్తిరింపు నుంచి ముఖ్యమంత్రిపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలను ఎక్కుపెడుతోన్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సిఎంపై మరోసారి మండిపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో తను సంప్రదించలేదని కడప జిల్లాలో ఉపఎన్నికలకు తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
ఉపఎన్నికలు జరిగే అన్నిచోట్లా ఏదో ఒక రూపంలో అసమ్మతి జ్వాల రగులుతుండడంతో కాంగ్రెస్ అగ్రనేతలకు కొత్త తలనొప్పి ఎదురైంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more