పరకాల ఉపఎన్నిక తర్వాత మహొద్యమాన్ని నిర్మించి తెలంగాణ సాధిస్తామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. వికారాబాద్ లో జరుగుతున్న టిఆర్ఎస్ 11వ వార్షికోత్స వ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణవాదం పేరుతో ఇప్పుడు కొందరు కొత్త భిక్షగాళ్లు వస్తున్నారని అన్నారు. జాతీయ పార్టీల పేరు చెబుతున్నారని, ఇప్పుడసలు జాతీయ పార్టీలున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. పేరు జాతీయం, ఉనికి ప్రాంతీయం అని విమర్శించారు. జాతీయ పార్టీలను నడుపుతుంది ప్రాంతీయ పార్టీలే అన్నారు. భారతదేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఒక ప్రబలమైన శక్తిగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆరు నూరైన టీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని స్పష్టం చేశారు. పార్టీ విలీనానికి సంబంధించి జరుగుతున్న విషప్రచారాన్ని నమ్మద్దని చెప్పారు. తెలంగాణ సాధన తర్వాత తెలంగాణ పునఃనిర్మాణమే టీఆర్ఎస్ లక్ష్యం అని ఆయన తెలిపారు. ఆయన మొదట ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప పోరాటయోధుడు జయశంకర్ అని కొనియాడారు. సమైక్య పాలనలో తెలంగాణ జీవనం విధ్యంసం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాశవిక అణచివేతల వల్లే తెలంగాణ ఉద్యమాలు ముందుకు సాగలేదన్నారు. త్యాగాల పునాదుల మీద టీఆర్ఎస్ ఏర్పడిందని చెప్పారు.
కలుషిత జలాలతో పొంగిపొరలే మూసినదికి తెలంగాణ వస్తేనే పూర్వవైభవం వస్తుందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. పార్లమెంటులో రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేయించి మోసం చేసిందన్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. మాట నిలబెట్టుకోమని తెలంగాణ ఎంపీలు అడిగితే వారిని సస్పెండ్ చేశారన్నారు. ఇది తెలంగాణకు జరిగిన అవమానంగా ఆయన పేర్కొన్నారు. సస్పెండయిన ఎంపిలు ఇంకా కాంగ్రెస్ కాళ్లు పట్టుకొని వేళాడవద్దని సలహా ఇచ్చారు. తెలంగాణ దెబ్బకు చంద్రబాబు, ఆయన పార్టీ కుప్పకూలి ఇంకాలేవలేదన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ మిత్రద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more