మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను హైదరాబాద్కు రప్పించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిందంటూ విశాఖపట్టణంవాస్తవ్యురాలు చేసిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇటీవల తారాచౌదరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసుల విచారణలో తారాచౌదరి తన కస్టమర్ల లిస్టును బయటపెట్టింది. ఇద్దరు ఎంపీలు, ఓ రాజ్యసభ సభ్యుడు, నలుగురు శాసనసభ్యులు, ఎనిమిదిమంది పోలీసు అధికారులు, ఇరవైమందికి పారిశ్రామిక పైగా తనకు పరిచయాలు ఉన్నట్టుగా ఆమె వెల్లడించింది.
తాను ఎవరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజలేదని పేర్కొంది. దర్యాప్తులో తారాచౌదరి వెల్లడించిన వివరాల మేరకు పోలీసులు ఆమె నివాసంలో సోదాలు జరిపి తొంభైకి పైగా వీడియో, ఆడియో సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తనకు ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రాణభయం ఉందని చెప్పిన తారాచౌదరి తాజాగా బంజారాహిల్స్ ఏసీపీ శంకర్డ్డిపై కోర్టు మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసింది. తనతో పరిచయాలు ఉన్నవారికి ఫోన్లు చేసి తన ఎదుటే సెటిల్ మెంట్ చేసుకున్నారని తెలిపింది. పోలీసువర్గాల ద్వారా తెలిసిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
అప్పట్లో తారాచౌదరి నివాసంలో తనిఖీలు నిర్వహించగా బెడ్రూముల్లో స్పై కెమెరాలు దొరికాయి. దాంతోపాటు కొన్ని వీడియో, ఆడియో సీడీలు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. దర్యాప్తులో తారాచౌదరికి పలువురు రాజకీయ నాయకులతోపాటు పోలీసు ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైంది. తన కస్టమర్ల జాబితాలో ఉన్న కొందరి రాసలీలలను తారాచౌదరి స్పై కెమెరాల ద్వారా రికార్డు చేసినట్టుగా తేలింది. కొందరు ప్రముఖులతో జరిపిన సంభాషణలను కూడా రికార్డు చేసినట్టుగా బయటపడింది. వీటిని అడ్డం పెట్టుకుని తారాచౌదరి బ్లాక్మెయిలింగ్కు పాల్పడటం ద్వారా లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీసులు కోర్టు అనుమతితో ఆమెను నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని క్షుణ్నంగా విచారించారు. ఈ దర్యాప్తులో తారాచౌదరి తనకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపీలు, ఓ రాజ్యసభ సభ్యునితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నట్టుగా వెల్లడించింది. పోలీసుశాఖలో ఐపీఎస్ స్థాయి అధికారులు మొదలుకుని పలువురు ఇన్స్పెక్టర్లతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా చెప్పింది. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ పరిశ్రమకు చెందినవారితో కూడా తనకు పరిచయాలు ఉన్నట్టుగా తెలియజేసింది. వీరితోపాటు తన వద్దకు వచ్చేవారిలో ఉన్నత కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్టు వెల్లడించింది. స్పై కెమెరాలు, సెల్ఫోన్ల ద్వారా తాను కొంతమంది రాసలీలలను చిత్రీకరించటంతోపాటు సంభాషణలను కూడా రికార్డు చేసినట్టుగా తెలియచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more