భారతి డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న జేతి సచిన్ అనే విద్యార్థికి ఏవీవీ కళాశాల పరీక్షా కేంద్రంగా పడింది. ఈ-కామర్స్ పరీక్ష రాసే సమయంలో సచిన్ పదేపదే తన చేతికున్న వాచ్ను చూసుకుంటుండడంతో విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన పరిశీలకుడు సంతోష్కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన సచిన్ చేతికున్న వాచీని పరిశీలించాడు. ఆయన షాక్ తిన్నాడు. సచిన్ చేతికున్న వాచీ మాముల్ వాచీ కాదు? అది ఐపాడ్ వాచ్గా ఆయన గుర్తించారు. ఈ కామర్స్ పాఠ్యపుస్తకంలో ఉన్న సమాచారమంతా అందులో ఉంది.
టెక్నాలజీని మంచికీ వాడవచ్చు, చెడుకూ వాడవచ్చునని ఓ విద్యార్థి రుజువు చేశాడు. పాఠ్యపుస్తకం మొత్తాన్నీ సాఫ్ట్కాపీ రూపంలో వాచీలోకి ఎక్కించేసుకుని పరీక్ష హాలుకు వెళ్లాడు. దాని నుంచి కాపీ కొడుతు అతను పట్టుబడ్డాడు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏవీవీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
దాని సహాయంతో సచిన్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు జవాబులు రాస్తున్నట్టు సంతోష్ గ్రహించారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి, యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాపీ కొడుతున్నందుకు ఆ విద్యార్థిపై కేసు బుక్ చేసి హాల్టికెట్ తీసుకుని పంపించారు.సచిన్ వినియోగించిన వాచ్ విలువ రూ.25వేలు. చూడ్డానికి మామూలు చేతిగడియారంలా కనిపించే దీని సామర్థ్యం 32 జీబీ. ఇందులో సంగీతం, సినిమాలతోపాటు వెయ్యికిపైగా పుస్తకాలను నిక్షిప్తం చేయవచ్చు. మనకు కావాల్సిన పుస్తకాలను స్కాన్ చేసి ఈ చిప్లో ఇన్స్టాల్ చేసి ఎప్పుడైనా తెరిచి, టచ్ స్క్రీన్ ద్వారా చదువుకోవచ్చు.
సచిన్ చేసింది కూడా ఇదే. ఈ-కామర్స్ పాఠ్యపుస్తకాన్ని ప్రశ్నలు, జవాబుల రూపంలో ఐపాడ్లోకి నిక్షిప్తం చేసుకున్నాడు. వెలుతురులో ఇందులో ఏముందో పైకి కనిపించదు. కానీ, వెలుతురు తక్కువగా ఉన్న గదిలో ఇందులో ఉన్న సమాచారం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. దాని సహాయంతో కాపీ కొడుతూ సచిన్ దొరికిపోయాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more