ప్రతిష్టాత్మకంగా జరిగిన కోవూరు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి ఎస్ చంద్రమోహన్ రెడ్డిపై 23,496 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నల్లపురెడ్డి విజయంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
రాష్ర్టంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రెండో ఎమ్మెల్యే గా ఎన్నికయిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరు ఉప ఎన్నికలో తన గెలుపు కాంగ్రెస్, టీడీపీలకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. తానెప్పుడూ మెజారిటీ గురించి మాట్టాడలేదని, గెలుస్తానని మాత్రమే చెప్పానని అన్నారు. తనకు 23,496 ఓట్ల ఆధిక్యం రావడం మామూలు విషయం కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీలు విచ్చలవిడిగా డబ్బులు పంచినా తనకు ఇంత మెజారిటీ రావడం చిన్న విషయం కాదని చెప్పారు. ఈ రెండు పార్టీలకు నూకలు చెల్లాయన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ సేవలకు ఓటర్లు పట్టం కట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. యువనేత వైఎస్ జగన్ నాయకత్వంలో తనను ఆశ్వీరదించి ప్రజలు గెలిపించారనన్నారు. కోవూరు ప్రజలకు రుణపడివున్నానని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసినవారందరికీ ప్రసన్నకుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more