Manoj gautham

manoj gautham, Bus, 5 month babu, Hyderabad, ravuri rambabu, laleetha , Police, municipal staff, Road , nakirekal

manoj gautham

manoj gautham.gif

Posted: 03/14/2012 10:29 AM IST
Manoj gautham

gauthamప్రయాణిస్తున్న బస్సు కిటికీలో నుంచి ఐదు నెలల పసి బాలుడు జారి కింద పడి ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన రావూరి రాం బాబు - లలిత జిల్లా జగ్గయ్యపేటలో శుభకార్యానికి హాజరయ్యారు. పెద్ద కుమారుడిని బంధువుల ఇంటి వద్ద ఉంచి చిన్న కుమారుడు మనోజ్ గౌతమ్(5నెలలు)తో హైదరాబాద్ బస్సు ఎక్కారు. కిటీకి పక్కన కూర్చున్న లలిత చిన్నారిని భుజంపై వేసుకుంది.
తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం వద్ద తల్లి భుజంపై ఉన్న మనోజ్ కిటికీ నుంచి జారి రహదారిపై పడిపోయాడు. కట్టంగూర్ దాటాక చిన్నపిల్ల ఏడుపు వినిపించడంతో ఉలిక్కిపడిన లలిత లేచి చూడగానే చిన్నారి కనిపించలేదు. మనోజ్ రోడ్డుపై పడిపోగానే అటువైపుగా వచ్చిన రిక్షా కార్మికుడు, మున్సిపల్ సిబ్బంది బాలుడిని రక్షించి పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు చేసేందుకు నకిరేకల్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారిని ఇచ్చారు. బాలుడు దొరకడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ips narendra kumar singhs family demands justice
Srenu talking after 13 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles