టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరు ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. ప్రస్తుతం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం.వి.మైసూరారెడ్డి పదవీకాలం ఏప్రిల్ తొలివారంలో ముగియనుంది. కాగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా టీడీపీకి రెండు రాజ్యసభ సీట్లు లభిస్తాయి. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చ ంద్రబాబుతోపాటు ఆయన బినామీల అక్రమాస్తులపై విచారణ జరపాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చిన రోజునే యనమలకు రాజ్యసభ టికెట్టు ఖరారైందని పార్టీ నేతలు చెప్పారు. ఇక మిగిలింది మరో సీటు. దీనిని పారిశ్రామికవేత్త, పార్టీ ఉపాధ్యక్షుడు సీఎం రమేష్, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు బోండా ఉమామహేశ్వరరావు, చందు సాంబశివరావు, చిక్కాల రామచంద్రరావులు ఆశిస్తున్నారు. వీరితోపాటు సీమాంధ్ర నుంచి వర్ల రామయ్య, ఉప్పులేటి కల్పన తదితరులు రాజ్యసభకు వెళ్లాలనే ఆశతోఉన్నారు.
తెలంగాణ ప్రాంతంలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడినుంచి ఒకరిని రాజ్యసభకు పంపక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఆరింటిలో మూడు స్థానాలు మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నాయి. ఈ మూడింటిలోనూ ఒక్క సీటును కూడా దళితులకు కేటాయించలేదు. దీంతో ఈ జిల్లాకు చెందిన బక్కని నరసింహులుకు రాజ్యసభ సీటు ఇవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబుకు నె లకొంది. అయితే తెలంగాణ నుంచి రాజ్యసభ సీటును ఆశించేవారిలో ఎం.అరవిందకుమార్గౌడ్, గరికపాటి మోహనరావు, తలసాని శ్రీనివాసయాదవ్, వేం నరేందర్రెడ్డి, పాల్వాయి రజనీకుమారి, అరిగెల నాగేశ్వరరావు, తీగల కృష్ణారె డ్డి, జి.సాయన్న తదితరులున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more