తనవి చౌకబారు మాటలో, ధర్మానది అధికార దుర్వినియోగమో ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలోనే తేల్చుకుందామని.. దమ్ముంటే అక్కడ ప్రజావేదిక ఏర్పాటుచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ మంత్రి ధర్మాన ప్రసాద్కు సవాల్ విసిరారు. సభలో సభ్యుడిని కాని తన గురించి అసెంబ్లీలో మాట్లాడటం చట్ట విరుద్ధమని, ధర్మానపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ మహాసభల సందర్భంగా కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడారు. మంత్రి ధర్మాన తన కొడుకు పెళ్లి రిసెప్షన్ కోసం శ్రీకాకుళంలోని వీఆర్వో పరీక్షా కేంద్రమైన ప్రభుత్వ కళాశాలను వాడుకున్నారని, దీంతో ఆ కళాశాలలో వేయాల్సిన కేంద్రాన్ని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్ఛాపురానికి తరలించారని తెలిపారు.
ఫలితంగా శ్రీకాకుళం శివారు గ్రామానికి చెందిన రామ్మోహన్ తన కూతురుతో పరీక్ష రాయించేందుకు మోటర్ సైకిల్పై వెళుతూ ప్రమాదానికి గురై చనిపోయారని, కూతురు రెండు కాళ్లు విరిగిపోయాయని నారాయణ వివరించారు. ఈ విధంగా మంత్రి ధర్మాన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నారాయణ ఆరోపించారు. ఈ విషయమై అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు మాట్లాడుతున్నపుడు కలగజేసుకున్న మంత్రి ధర్మాన, సీపీఐ నాయకులు నారాయణ లాగే చౌక బారుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు చౌకబారువని నిరూపిస్తే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తానని, కొడుకు రిసెప్షన్ కోసం సెంటర్ మార్చినట్లు తాను నిరూపిస్తే ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలోనే ప్రజా వేదిక ఏర్పాటు చేయాలని ఆయన సవాల్ విసిరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more