మంచి ఉద్దేశ్యంతో ప్రజాహితంలో పనిచేద్దామనుకునే రాజకీయ నాయకులకైనా సీటు సంపాదించుకోవటం, అధికారం చేజిక్కించుకోవటం, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవటం కూడా అవసరమే. అవే లేకపోతే వారు చెయ్యగలిగేదేముంది. అందువలన, అందులో తప్పు కూడా ఏమీ లేదు. కానీ అదే పని తప్ప మరొకటి లేకుండా అయినప్పుడే, మరితర విషయాలకు సమయం లేనప్పుడే వస్తుంది తంటా. రాష్ట్రంలో రాజకీయం కొన్నాళ్ళు నాలుగు స్థంభాలాటైపోయింది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి ఈ నాలుగు మూల స్థంభాల మధ్య పార్టీ నాయకులు అటు ఇటు పరుగులు తీసారు. ఇదంతా చూసిన భాజపా కూడా మరో స్థంభమవటానికి రాష్ట్రంలో యాత్రలు చేపట్టింది.
ఇప్పుడిక దాదాపూ ఎవరి శక్తోమిటో వారికి తెలిసిపోయిన తర్వాత పెద్ద పరీక్షల్లాంటి 2014 ఎన్నికలు, ఈలోపులో వచ్చే హాఫ్ ఇయర్లీ లాంటి ఉప ఎన్నికలలు లక్ష్యమైపోయాయి. దానితో నోటికి పని చెప్పవలసి వస్తోంది. మా పార్టీ గొప్పదంటే మాది గొప్ప అని చెప్పుకోవటం మామూలే కానీ, ఇతర పార్టీల వైఖరి, వారి నాయకులను విమర్శించటం మరీ ఎక్కువైపోతోంది. దానికి తోడు ఇతర పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్, కుమ్ముక్కుల అనుమానాలు కూడా వెలిబుచ్చటం పరిపాటైపోయింది.
మేడారం జాతరను వేదికగా చేసుకుని కెసిఆర్ కొన్ని వ్యాఖ్యానాలు చేస్తే అలా మాట్లాడటం సరికాదని చంద్రబాబు, చంద్రబాబు మాటలలో తప్పులు వెతుకుతూ పార్టీ బ్యూరీ సమావేశం తర్వాత తిరిగి కెసిఆర్ వ్యాఖ్యానిస్తే, ఇన్నాళ్ళూ మాట్లాడకుండా ఊరుకున్న కెసిఆర్ ఇప్పుడు పోలవరం టెండర్లు రద్దవటంతో రెచ్చిపోతున్నారని తెదేపా నాయకుడు ఎర్రబల్లి దయాకరరావు అన్నారు. తెలంగాణా గురించి పార్లమెంటులో ఎప్పుడూ మాట్లాడని కెసిఆర్, కాంగ్రెస్ ని, సోనియా గాంధీని తప్పు పట్టని కెసిఆర్ కేవలం తెదేపా వలనే చేజిక్కించుకున్న పోలవరం టెండర్లు చెయిజారిపోవటంతో తెదేపా మీద అక్కసుని వెళ్ళగక్కుతున్నారని ఎర్రబల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో అన్నారు.
అయితే ఇదంతా కూడా ప్రజాహితమే! ఎవరో ఒకరి ద్వారా మిగతావారి తప్పులు బయటపడుతన్నాయి. ఇదే లేకపోతే నిజంగానే అందరూ కుమ్మక్కవుతే ఇంకేమైనా ఉందా?
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more