డాక్టర్ అంబేద్కర్ కి ఢిల్లీలో దేశ నాయకులతోపాటు మెమోరియల్ లేదన్న విషయాన్ని సహ చట్టం ద్వారా వెలికితీసిన చంద్రకాంత్ భండారే, ఈ విషయంలో తన ఆవేదనను వ్యక్తం చేసారు. ఢిల్లీలో కాని ఇతర ప్రాంతాల్లో కానీ రాజ్ ఘాట్, ఇతర ఘాట్ లు, మెమోరియల్స్ ని స్థాపించే విధానమేమిటన్న వివరాలను కోరుతూ చంద్రకాంత్ సహ చట్టం కింది చేసిన అభ్యర్థనకు లభించిన జవాబులో, 14 మంది దేశనాయకులకు మెమోరియల్స్ కోసం జాగా ఇచ్చారని తెలియవచ్చింది. నగరాభివృద్థి మంత్రిత్వ శాఖ, సిపిడబ్ల్యుడి, హోం మంత్రిత్వ శాఖలను వివరాలను ఇవ్వమని అడిగిన అతను పెట్టిన అర్జీకి స్పందిస్తూ, ఈ నాయకులకు మెమోరియల్స్ కోసం కేటాయించామని తెలియజేసారు.
1.మహాత్మా గాంధీ, 2. జవహార్ లాల్ నెహ్రూ, 3. లాల్ బహాదూర్ శాస్త్రి, 4. ఇందిరా గాంధీ, 5. సంజయ్ గాంధీ, 6. రాజీవ్ గాంధీ, 7. చరణ్ సింగ్, 8. జైల్ సింగ్, 9. జగ్జీవన్ రామ్, 10. దేవీలాల్, 11. కె.వి.నారాయణ, 12. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, 13. చంద్రశేఖర్, 14. శంకర్ దయాల్ శర్మ.
బాబాసాహెబ్ మరణించి 56 సంవత్సరాలైంది. ఆయన దేశనాయకుడు కాదా. ఆయనకి మెమోరియల్ ఎందుకు లేదు అంటూ చంద్రకాంత్ భండారే ఆవేదనచెందారు.
శివాజీ పార్క్ దగ్గరున్న ఇందూ మిల్స్ ప్రాంతంలోని బుద్ధిస్ట్ సొసైటీ ఒకటి డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ కి జాగా ఇవ్వగా అంబేద్కర్ అభిమానులు ప్రతి సంవత్సరం లక్షల్లో సందర్శిస్తున్నారు. దాదర్ లోని ఇందూ మిల్స్ లోని 12.5 ఎకరాల మొత్తం స్థలాన్నీ అంబేద్కర్ మెమోరియల్ కోసం కేటాయించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష నిర్ణయాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సైద్ధాంతికంగా సమ్మతించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more