ఔషధాల తయారీలో ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ర్యాన్బాక్సీపై అమెరికాలో మరిన్ని సమస్యలు ఎదురుకానున్నాయి. కంపెనీపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఇంజంక్షన్ ఆదేశాలు జారీ చేయాలంటూ మేరీల్యాండ్ కోర్టును అమెరికా న్యాయశాఖ కోరింది. ఇందుకోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) విజ్ఞప్తి మేరకు కాన్సెంట్ డిక్రీని దాఖలు చేసింది. కోర్టు దీనికి సానుకూలంగా స్పందిస్తే.. అమెరికా, భారత్లోని ప్లాంట్లలో ర్యాన్బాక్సీ కీలక మార్పులు చేయాల్సి వస్తుంది.
అలాగే, ప్రమాణాలను మెరుగుపర్చుకునే వరకూ కొన్ని ప్లాంట్లలో ఔషధాల తయారీని పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని న్యాయశాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ టోనీ వెస్ట్ తెలిపారు. కంపెనీ తన లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు భవిష్యత్లో మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, గతేడాది డిసెంబర్ 20న కుదుర్చుకున్న కాన్సెంట్ డిక్రీలో పేర్కొన్న షరతులకు కట్టుబడి ఉంటామని, మెరుగైన ప్రమాణాలను పాటిస్తామని ఢిల్లీలో ర్యాన్బాక్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనకు సంబంధించి భారత్లోని పౌంతా సాహిబ్, బాటామండీ, దేవాస్ ప్లాంట్లలో తయారయ్యే ఔషధాల దిగుమతిపై 2008లో ఎఫ్డీఏ అలర్ట్ విధించింది. ఈ మూడు ప్లాంట్లలో తయారు చేసే 30 జనరిక్ ఔషధాలను నిషేధించింది. అటుపైన ఇదే అంశంపై, అమెరికా గ్లోవర్స్విల్లో ఉన్న కంపెనీ ప్లాంటు కూడా మూతపడింది. తాజా కాన్సెంట్ డిక్రీ షరతుల ప్రకారం ఈ ప్లాంట్లు ప్రమాణాలను అందుకునే దాకా వీటిలో అమెరికా మార్కెట్ కోసం ఔషధాలు తయారు చేయడానికి ఉండదు. అలాగే, ప్రభావిత ప్లాంట్లలో పరిస్థితులను సమీక్షించేందుకు ప్రత్యేక నిపుణుడిని నియమించుకోవాల్సి ఉంటుది. అదేవిధంగా స్వతంత్ర ఆడిటర్తో ఆడిటింగ్ జరిపించాల్సి ఉంటుందని అమెరికా న్యాయశాఖ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more