ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి ఛైర్మన్ గా నియమితులైన మొదటి రోజు నుంచీ మీడియా వైఖరి మీద తనదైన శైలిలో వాడిగా సూటిగా వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్న మాజీ సుప్రీం కోర్టు జడ్డి జస్టిస్ మార్కండేయ కట్జూ నిన్న జైపూర్ లో జభర్ మల్ శర్మ మెమోరియల్ ప్రసంగంలో మాట్లాడుతూ, మీడియా వార్తలలో మత్తు మందు కూర్చి ప్రజలను మభ్యపెడుతోందని, దానితో వారు తమ పేదరికం గురించి మర్చిపోతున్నారని ఆయన అన్నారు.
ఎక్కువగా జర్నలిస్ట్ లు విశ్లేషకులు, విద్యాప్రమాణవేత్తలు పాల్గొన్న ఆ సమావేశంలో మాట్లాడుతూ, తాను ఒక విమర్శకుడిగానూ, శ్రేయోభిలాషిగానూ పాత్రికేయులను సరైన మార్గంలోకి వచ్చేట్టుగా చెయ్యటానికి కృషి చేస్తానన్నారు.
పేదరికంలో కూరుకుపోయిన దేశం ఎప్పడు పగిలి లావా బయటకు వస్తుందో తెలియని అగ్ని పర్వతం మీద కూర్చునివుంటే, మీడియా ప్రస్తుతం నాలుగు రకాల మత్తు పదార్థాలనుపయోగిస్తున్నదని అవి, మతం, సినిమాలు, క్రికెట్ ల మీద వ్యాఖ్యానాలు, లేనిపోని విషయాలమీద ఆసక్తి కరంగా రాయటాలు ఇవే. దీనివలన ప్రజలంతా దారిద్ర్యం, ఇతర ఈతి బాధల గురించి పట్టించుకోవటం, ఆందోళన చెందటం, ఆందోళన చెయ్యటం జరగదు. ఇదే లక్ష్యం. అని జస్టిస్ కట్జూ ఆరోపించారు.
జయపూర్ లో జరుగనున్న సాహిత్య వేడుకల గురించి మాట్లాడుతూ, చిన్నప్పుడు తాను చదివిన జానపద కథల తో కూడిన చంద్రకాంత సంతతి అనే పుస్తకం గుర్తుకొస్తోందని, అందులో అన్నీ ఊహాగానాలతో కూడిన కాకమ్మ కథలే ఉన్నాయని చెప్తూ, ఈ సాహిత్య వేడుకల్లో పాల్గొంటున్నవారికి తాము చేస్తున్న పనిమీద కనీసం వారివరకైనా ఆత్మసంతృప్తి లభిస్తుందా అంటూ ప్రశ్నించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more