సమన్వయ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఆజాద్ మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. ఈ మధ్యలో శని, ఆదివారాలలో జరగవలసిన రెండవ సమన్వయ కమిటీ మీటింగ్ నామమాత్రంగానే మిగిలిపోయింది. ఎజెండా ఏమిటంటే ఏమీ లేదంటారాయన. మంత్రులకు సైతం ఆయన సమయాన్నివ్వలేకపోయారు. ఇక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల సంగతి ఏం చెప్పాలి. ఆజాద్ వస్తున్నారని ఆయనతో ఏం మాట్లాడాలి, ఏ విషయాలు ఎలా ఆయన చెవుల్లో ఇంపుగా ఉండేట్టుగా పడేయాలని రిహార్సల్స్ చేసుకున్న పార్టీ శ్రేణులకు నిరాశే మిగిల్చి మరలిపోయారు ఆజాద్.
లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి వస్తారని తెలుసుకుని అక్కడ ఎందరో ఆయన కోసం వేచిచూస్తే అక్కడికీ రాలేదు. గాంధీ భవన్ లో కలుస్తారేమోనని ఆశపడ్డారు. ఏదో సమన్వయం చేపట్టారు తమ గోడు వింటారనుకున్న ఆజాద్, కేవలం ప్రముఖులతోనే కలవటం, వారితో విందులారగించటం పార్టీ లో చాలామందికి అసంతృప్తిని మిగిల్చింది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డి.కె.అరుణ ఇంకా ఎందరో మంత్రులు సీనియర్లు ఆజాద్ కి దూరం నుంచి నమస్కారం పెట్టి ఊరుకోవటమే జరిగింది కానీ మాట్లాడటానికి అవకాశం చిక్కలేదు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు, ఆ తర్వాత ఆయన గవర్నర్ తో భేటీ అయ్యారు.
కలవని వాళ్ళని ఎలాగూ కలవలేదు, కలిసిన వాళ్ళతో భేటీలు కూడా కేవలం మర్యాదపూర్వకంగా చేసిన భేటీలేనని అన్నారు. ఈసారి కూడా మరి ఎందుకొచ్చారండీ తమరు అని కూడా ఎవరూ అడగలేకపోయారు. మొదటిసారి ఆజాద్ వచ్చినపుడు రాసిన రిపోర్ట్ ని చదవాలంటే ఈ కింది లింక్ ని తెరవండి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more