అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే గోవాకు పరిశీలకులుగా ఈసారి అందరూ మహిళలే ఉన్న బృందాన్ని పంపాలని ఎన్నికల సంఘం ఈ వారారంభంలో నిర్ణయించింది. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. గోవాలో పురుషులను పరిశీలకులుగా పంపితే, బీచ్లలో విహరిస్తూ సరదాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలతో ఇసీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొందరు మహిళలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. ‘వారికేనా, మాకు సరదాలుండవా?’ అని రివర్సయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా అందరూ మహిళలే ఉన్న టీమ్ను పంపాలనుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నిర్ణయంపై పలు చర్చలు జరుగుతున్నాయి. విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమయంలో బహుజన సమాజ్పార్టీ (బీఎస్పీ) గుర్తు ఏనుగు, ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాలకు ముసుగులు వేయాలని ఇదివరకు ఇసీ తీసుకున్న నిర్ణయం మాదిరే ఈ నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. నిజంగా మహిళల్నే పరిశీలకులుగా పంపితే ఆ అంశం అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తుందని కొందరంటున్నారు.
గత ఎన్నికల్లో ఇసీ పరిశీలకులుగా పంపిన మగ అధికారులు ఎన్నికల అక్రమాలపై నిఘా ఉంచడానికి బదులు గోవా బీచ్లలో తిరిగి, హాట్ స్పాట్స్కు వెళ్లి, అక్కడి యువతులతో శృంగారం సాగించారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఇసీ ఈసారి మహిళాబృందాన్ని పంపాలని నిర్ణయించింది. దీనిపై బ్రిటీష్ పత్రిక ‘ఇండిపెండెంట్’ గోవాలోని బీచ్లు, అక్కడి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. మగవారు ఆ బీచ్లలో సరదాగా గడపాలనుకోవడం ఆశ్చర్యకరమేమీ కాదు’ అని రాసింది. గోవాకు తమను ఎన్నికలపరిశీలకులుగా పంపమని మగవారి నుంచి ఇసీకి ఎన్నో దరఖాస్తులు కూడా వచ్చాయి. అందులో అంతరార్థాన్ని గ్రహించిన ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళలు కూడా విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల సంఘం నిర్ణయం పక్షపాతంతో కూడుకున్నది. గోవాలో మగవాళ్లయితే సరదాగా తిరుగుతారు, ఆడవాళ్లు తిరగరన్న ఉద్దేశంతో ఇసీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ సరదా అన్నది మగవారికేనా, ఆడవారికి అక్కర్లేదా?’ అని తరచు గోవాకు వెళ్లే గినెల్లీ డిసౌజా ప్రశ్నించారు. ‘ఇండిపెండెంట్’ జర్నలిస్ట్ సుహాసినీ రాజ్ కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ‘కేవలం సెక్స్ కారణంగానే పురుషాధికారుల్ని కాదని, మహిళల్ని పరిశీలకులుగా పంపుతున్నారు. మహిళలు సరదాకు నోచుకోరా? గోవాలో వారికీ సరదాలుంటాయి’ అని ఒక జాబితా కూడా ఇచ్చారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more