ఇటలీ సముద్ర తీరంలో శుక్రవారం రాత్రి రాళ్లను ఢీకొట్టి మునిగిపోయిన కోస్టా కంకోర్డియా నౌక నుంచి 201 మంది భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ విషయాన్ని రోమ్లో భారత రాయబారి సునీల్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఇంకా ఒకరి జాడ తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. భారతీయులకు ప్రయాణ దస్తావేజులు ఇవ్వడంలో ఎలాంటి సమస్యలులేవని, టికెట్లు సిద్ధమైన వెంటనే దస్తావేజులు అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదం సమయంలో నౌకలో ఉన్న 300 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని, ఎవరూ మృతి చెందలేదని ఇటలీలోని భారత రాయబారి దేబవూబత సాహా ప్రకటించారు.
(ఇట లీ)లగ్జరీ లైనర్ కోస్టా కంకార్డియా నౌక ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో హైదరాబాద్కు చెందిన ఆరుగు రు ఉన్నారు. నౌక ప్రమాదవార్త తెలిసిన వెం టనే తొలుత భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు, వారు క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆనందానికి గురయ్యారు. ప్రస్తుతం వారంతా రోమ్లోని మారియట్ హోటల్లో బస చేశారని, అక్కడ్నుంచి నగరానికి బయలుదేరతారని వారి బంధువులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పదకొండుకు పెరిగింది. నౌక శిథిలాలను పేల్చి జరిపిన గాలింపులో మరో అయిదు మృతదేహాలు లభించాయి. ఇంకా 24 మంది జాడ తెలియవలసి ఉందని ఇటలీ కోస్ట్గార్డ్ అధిపతి మర్కో బ్రుస్కో తెలిపారు. ఈ దుర్ఘటనపై కూలంకషంగా దర్యాప్తు జరిపించాలని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ సాగ ర సంస్థ (ఐఎంఓ) ప్రధాన కార్యదర్శి కోజీ సెకిమిజు డిమాండు చేశారు. ఈ ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకోరాదని, భారీ ప్రయాణికుల నౌకల భద్రత అంశాన్ని పర్యావలోకనం చేయవలసిన అవసరాన్ని ఈ ప్రమాదం గుర్తు చేస్తున్నదని పేర్కొన్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more