Minister mopidevi venkata ramana

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Minister Mopidevi Venkata ramana.GIF

Posted: 01/10/2012 08:23 PM IST
Minister mopidevi venkata ramana

రాష్ట్రంలో ఎప్పటి నుండో కల్తీ సారా తయారీ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగా అనేక మంది కూడా చనిపోయారు. తాజాగా క్రిష్ణా జిల్లాలో కూడా కల్తీ కాటుకు బలయ్యారు. ఇన్ని సంఘటన తరువాతనైనా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. రాష్ట్రంలో కల్తీ కల్లు, సారా తయారీ దారులపై పీడీ చట్టం ప్రయోగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ హెచ్చరించారు. గుంటూరు ఆర్అండ్‌బి అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ సారా, కల్లు తాగి మృతి చెందిన సంఘటనలపై దర్యాప్తు జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు.

తయారీ దారులు కొన్ని రకాల కెమికల్స్ కలపటం వలన తాగిన వారు మృతి చెందినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పండుగల సమయంలో కల్లు, సారా తయారీ దారులపై క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖలో ఖాళీగా ఉన్న 2,400 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. 1994 నుంచి ఈ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. సిండికేట్ కార్యాలయాలపై ఏసీబీ దాడులలో సేకరించిన సమాచారాన్ని శాఖాపరంగా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అమాయకుల ప్రాణాలను కాపాడలని ప్రజలు కోరుతున్నారు. మరి ఇది ఎవకు అమలు చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malnutrition national shame says pm
Chiranjeevi says balakrishna is kid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles