రేపటి నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మూడు రోజుల దీక్షకు పూనుకున్న వైయస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కార్యక్రమం సవ్యంగా జరుగుతుందా అన్నది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. ఉప ఎన్నికలలో తెలంగాణాలో తెరాస కు వ్యతిరేకంగా పోటీ చెయ్యబోమని తన పార్టీ వైఖరిని జగన్ తెలియజేయటంతో తెలంగాణాలో వ్యతిరేకత రాదన్న ఉద్దేశ్యంతో ముమ్మరంగా ఏర్పాట్లను చేసుకుంటున్న జగన్ కార్యకర్తలకు ఇప్పుడు ఆ కార్యక్రమం మీద అనుమానాలొస్తున్నాయి. మామూలుగా అయితే అది పెద్దగా విశేషాన్ని సంతరించుకోకుండా సాగిపోయేదేమో కానీ, తాజాగా ప్రతిపక్ష నాయకుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో చేసిన పర్యటనకు వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా, జగన్ మీద కూడా నిరసన వెలిబుచ్చుతారా, లోగడ ఓదార్పు యాత్రను అడ్డుకున్నట్టుగానే ఇప్పుడూ అడ్డుకుంటారా అన్న సంశయాన్ని కలిగిస్తూ వచ్చింది. అయితే ఆ సంశయం కాస్తా ఈ రోజు ఉదయం వీడిపోయింది.
తెదేపా తో చేతులు కలిపి తెలంగాణా కూ వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకున్న జగన్ ముందుగా దానికి సంజాయిషీ చెప్పి తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలని తెరాస నాయకుడు హరీష్ రావు కోరుతున్నారు. జెఏసి కన్వీనర్ ప్రొ.కోదండరామ్ కూడా జగన్ కి వ్యతిరేకంగా మీడియాలో ప్రకటన చేసారు. ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే, తెలఁగాణాకు వ్యతిరేకంగా పనిచేసేవారిని, తెలంగాణా ద్రోహులైనవారిని తెలంగాణా ప్రాంతంలో తిరగనివ్వబోమని హెచ్చరిస్తూ, అందుకు సహకరించమని తెలంగాణా ప్రజలకు కోదండరామ్ ఈరోజు విఙప్తి కూడా చేసారు.
దానితో సంశయం కాస్తా విడిపోయింది. తెదెపా ను వరంగల్ జిల్లాలో అడ్డుకున్నందుకు వెల్లువెత్తుతున్న నిరసనల దృష్ట్యా, ఆ పార్టీ కార్యక్రమాన్ని జగన్ ప్రకటించిన కార్యక్రమంతో పోల్చి పలువురూ పలువిధాలుగా అనుకుంటుండటం వలన తెలంగాణా వాదులు ఈ స్పష్టమైన ప్రకటనను ఇవ్వవలసివచ్చింది. ఒకవేళ మిగతా పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెరాసకు రహస్య ఒప్పందాలేమైనా ఉన్నా, వస్తున్న ఆరోపణల దృష్ట్యా కూడా, తెరాస ఐకాసల ప్రకటనలు ఈ రోజు ఇలా రావలసిందే.
ఇక మిగిలిన సంశయమల్లా జగన్ వర్గం ఎలా స్పందిస్తుందన్నదే. తెదేపా లాగా తెరాసను పట్టించుకోకుండా ముందుకెళ్తారా లేకపోతే తెరాసాకు తలవొగ్గి కార్యక్రమాన్ని మానుకుంటారా లేదా మరో మధ్యేమార్గాన్ని ఎన్నుకుంటారా అన్నదే వేచి చూడవలసిన విషయం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more